Moviesమ‌ద్యం సేవించి అడ్డంగా బుక్ అయిన తెలుగు హీరోయిన్‌... పోలీస్ కేసు..!

మ‌ద్యం సేవించి అడ్డంగా బుక్ అయిన తెలుగు హీరోయిన్‌… పోలీస్ కేసు..!

కావ్యా థాప‌ర్ ఈ హీరోయిన్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా సుప‌రిచిత‌మే. ఏక్ మినీ క‌థ సినిమాతో తెలుగులో బాగా పాపుల‌ర్ అయ్యింది. ఈ సౌత్ ఇండియ‌న్ భామ అంద‌చందాల‌తో యూత్ బాగా టెంప్ట్ అయ్యింది అన్న‌ది నిజం. ఆ త‌ర్వాత కావ్యకు వ‌రుస‌గా ఆఫ‌ర్లు వ‌స్తాయ‌నే అంద‌రూ అనుకున్నా అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు. ఏక్ మినీ క‌థ సినిమాలో ద‌ర్శ‌కుడు శోభ‌న్ త‌న‌యుడు సంతోష్ శోభ‌న్ హీరోగా న‌టించాడు.

 

తాజాగా ఏక్ మినీ క‌థ హీరోయిన్ కావ్య థాప‌ర్ అరెస్టు అయ్యింది. ముంబైలో తాగి వాహ‌నం న‌డిపిన ఈ భామ మ‌ద్యం మ‌త్తులో కారు డ్రైవ్ చేయ‌డంతో పాటు ఒక‌రిని గుద్దేసింది. స‌ద‌రు వ్య‌క్తిని గుద్ద‌డంతో పాటు పోలీసుల‌తో ఘ‌ర్ష‌ణ ప‌డి చివ‌ర‌కు అరెస్టు వ‌ర‌కు వెళ్లింది వ్య‌వ‌హారం. కావ్య చేసిన ప్ర‌మాదంలో స‌ద‌రు వ్య‌క్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘ‌ట‌న ఈ నెల 17న జ‌రిగింది.

ప్ర‌మాదం జరిగిన‌ప్పుడు కావ్య ఫుల్లుగా మ‌ద్యం సేవించి ఉన్న‌ట్టు కూడా పోలీసుల రిపోర్టుల్లో వెల్ల‌డైంది. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు జ్యూడీషియ‌ల్ రిమాండ్‌కు త‌ర‌లించారు. అంతే కాకుండా పోలీసుల‌తో ఘ‌ర్ష‌ణ ప‌డినందుకు ఆమెపై ఘ‌ర్ష‌ణ కేసు కూడా బుక్ అయ్యింది. ఈ కేసుపై ప్ర‌స్తుతం విచార‌ణ కొన‌సాగుతోంది. ఇక ఆమె తెలుగులో న‌టించిన ఏక్ మినీ క‌థ సినిమాను యూవీ క్రియేష‌న్ష్ నిర్మించింది. ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి సంతోష్‌తో పాటు కావ్య‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news