Moviesఆమెను చూసి బుద్ధి తెచ్చుకోండి ... వైరల్ అవుతున్న నమ్రత పోస్ట్...

ఆమెను చూసి బుద్ధి తెచ్చుకోండి … వైరల్ అవుతున్న నమ్రత పోస్ట్ ..!!

నమ్రతా శిరోద్కర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నమ్రత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరమయ్యి ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు. పెళ్లి కి ముందు ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా..పెళ్లి తరువాత మాత్రం అన్నీ ఆశలు వదులుకుని భర్త పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఈ విషయంలో నమ్రతకు సాటి రారు ఎవ్వరు అంటుంటారు మహెష్ అభిమానులు.

మహేష్ బాబు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ మ్యాన్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రేక్షకులు, ఫ్యాన్స్ సెలబ్రిటీలను ఫాలో అవుతుంటారు. మహేష్ నుంచి ఈ ఒక్క విషయం నేర్చుకుంటే చాలు చాలా కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. మహేష్ ప్రతిసారి తన కుటుంబం పట్ల తనకు ఎంత ప్రేమ ఉందో ఎంత ప్రాధాన్యతనిస్తారో రుజువుచేస్తూనే ఉంటారు. ఇక భార్య నమ్రత కూడా అలాంటి క్యారెక్టర్ నే. తనకు తెలిసిన నాలుగు మంచి విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తనకు తన బిడ్డలు, భర్తనే ప్రపంచం. అదే విషయాని మరో సారి ప్రూవ్ చేసింది.

ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నమ్రత ఎన్నో సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. అలాగే తన ఫ్యామిలీకి సంబంధించిన పోస్ట్లు కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు. ముఖ్యంగా తన ఫ్యామిలీతో గడిపే ట్రిప్స్ విషయంలో కూడా.. అదిరిపోయే ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది నమ్రత. ఈ క్రమంలో రీసెంట్ గా తన పుట్టిన రోజు జరుపుకున్న నమ్రత..సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఆ ఫోటోకి ”ప్రతి రోజు.. పిల్లలతో జాలీగా గడపడం కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు” అంటూ తన ఇద్దరు పిల్లలపై ఉన్నప్రేమను మరోసారి పంచుకున్నారు నమ్రత. ఈ ఫోటో నమ్రత పుట్టిన రోజు వేడుకల్లో తీసిన ర్యాండమ్ పిక్. ఇప్పుడు నమ్రత షేర్ చేసిన ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. క్షణాల్లో ఈ పోస్ట్ కు లైకులు వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు మిగతా హీరోయిన్లు మిమ్మల్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి మేడం అంటూ నమ్రతను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news