Moviesఅఖండ సినిమాలో బాలయ్య పక్కన నటించే బంగారంలాంటి ఛాన్స్ మిస్ చేసుకున్న...

అఖండ సినిమాలో బాలయ్య పక్కన నటించే బంగారంలాంటి ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్ ఈమే..!!

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘అఖండ’. BB3గా హాట్రిక్ హిట్ కొట్టిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే 100కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఇక ఈ ఇద్దరూ రంగంలోకి దిగితే బాక్స్ ఆఫిస్ షే అవ్వడం పక్కా అని మరోసారి ప్రూవ్ చేసారు.. ద్వారక క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా పూర్ణ కీలక పాత్రలో మెరిసింది . కాగా ఈ సినిమాలో మొదట బాలయ్య పక్కన హీరోయిన్ గా అనుకున్నది అందాల తార నయనతారనట.

 

ఇది వరకె బోయపాటి డైరెక్షన్ లో బాలయ్య హీరోగా నయన్ హీరోయిన్ గా సిమ్హా అనే మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమా లో వీళ్ల జంటకి మంచి మార్క్లు పడ్డాయి. నయనతార బాలయ్య పక్కన నడిచి వస్తుంటే ధియేటర్స్ లో విజిల్స్ మారుమ్రోగిపోయాయి. ఇక సిమ్హా సినిమా ఎంతటి గన విజయం సాధించిందో ప్రత్యెకంగా చెప్పనవసరం లేదు. ఇక మరోసారి వీళ్లు జోడీ కడితే బాగుంటుందని అభిమానులు సైతం కోరుకున్నారు. ఇక అఖండ సినిమాలో హీరోయిన్ గా చేయమని నయన తారను బోయపాటి అడిగితే ఆమె ముందు సరే అన్నారట.

కానీ బోయపాటి అడిన టైంకి ఆమె ముంద్ఫే వేరే సినిమాకి కాల్ షీట్స్ ఫిల్ అయిపోయాట. దీంతో అఖండ సినిమా నుండి నయన్ తప్పుకుంది. ఆ ప్లేస్ లో ప్రగ్యా జైస్వాల్ వచ్చింది. తెర పై బాలయ్య పక్కన ప్రగ్యా జైస్వాల్ బాగున్నప్పటికి ..నయనతార తో కంపేర్ చేస్తే ప్రగ్యా జైస్వాల్ అంతగా ఆకట్టుకోలేకపోయిందనే అంటున్నారు సినీ విశ్లేషకులు. శ్రీరామ రాజ్యం , జైసింహా మూవీలో ఈ జంట కనిపించినప్పటికి ఇంకోసారీ ఈ జంట జోడి కడితే చూడాలని అనుకుంటున్నారు మరి చూడాలి అభిమానుల కోరిక మేరకు బాలయ్య ,నయనతార మళ్లీ ఎప్పుడు కలిసి నటిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news