Moviesమిస్​ యూ అంటూ తారక్ ఎమోషనల్..కంటతడి పెట్టిస్తున్న పోస్ట్..!!

మిస్​ యూ అంటూ తారక్ ఎమోషనల్..కంటతడి పెట్టిస్తున్న పోస్ట్..!!

తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేశారు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు. తెలుగు చిత్ర సీమలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది ఆయన సినీ ప్రస్థానం. తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని దశదిశలా కీర్తింపజేశారు. ఆయన తనయులు నందమూరి హరికృష్ణ, బాలకృష్ణలు హీరోలుగా వెండి తెరకు పరిచయం అయినా..ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన తర్వాత హరికృష్ణ అయన మంచి చెడులు చూసేందుకు సినీ పరిశ్రమ నుంచి తప్పుకున్నారు.

తెలుగు చిత్రసీమలో తొలి నటవారసునిగా నందమూరి హరికృష్ణ నిలిచారు. మహానటుడు నటరత్న యన్టీఆర్ తన తనయుల్లో మూడవవాడైన హరికృష్ణను బాలనటునిగా ‘శ్రీకృష్ణావతారం’లోనే పరిచయం చేశారు. అంతేకాదు ఈయన రాజకీయాల్లోనూ తనదైన పాత్ర పోషించారు. తండ్రి యన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్ నియోజకవర్గం నుండి 1996లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకు ముందు చంద్రబాబు మంత్రివర్గంలో ట్రాన్స్ పోర్ట్ మినిష్టర్ గానూ పనిచేశారు. 2008లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.

కాగా..నల్లగొండ జిల్లా అన్నెపర్తి వద్ద నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన విషయం తెలిసిందే. ఇక నేడు అనగా సెప్టెంబర్ 2 నటుడు హరికృష్ణ 65వ జయంతి. ఈ సందర్భంగా.. పలువురు నటులు, అభిమానులు ఆయనను గుర్తుచేసుకుంటూ సామాజిక మాధ్యమాల వేదికగా నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కుమారులు ప్రముఖ హీరోలు తారక్, కల్యాణ్ రామ్ కూడా సంతాపం తెలిపారు. ఈ సంధర్భంగా తారక్ ఆయన అధికారిక ట్వీట్టర్ ఖాతలో.. “మీ 65వ జయంతి రోజున మిమ్మల్ని స్మరించుకుంటూ.. మిస్​ యూ నాన్న”.. అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news