Moviesఆ డైరెక్టర్ ను క్షమించమని కోరిన రష్మిక..ఎందుకో తెలుసా..??

ఆ డైరెక్టర్ ను క్షమించమని కోరిన రష్మిక..ఎందుకో తెలుసా..??

 

ప్రస్తుతం తెలుగులోనే కాక నేషనల్ వైడ్‌గా స్టార్ హీరోయిన్ అయ్యారు. టాలీవుడ్ లో ప్రస్తుతం రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో అందాల భామ రష్మిక ఒకరు. తన క్యూట్ క్యూట్ లూక్స్ తో టాలీవుడ్ లో రష్మిక ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దానికి కారణం టాలీవుడ్‌లో ఆమె లక్కీ హీరోయిన్‌గా మారడమే. తన అందంతో, నటనతో కుర్రకారును ఫిదా చేసింది. మంచి మంచి సినిమా స్టోరీస్ సెలెక్ట్ చేసుకుని.. బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తూ..బంపర్ ఆఫర్స్ కొట్టేస్తుంది ఈ చిన్నది. ఇంకెముంది పాప వెనక్కి తిరిగి చూసుకునే పనే లేకుండా పోయింది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ కన్నడ భామకు బాలీవుడ్ లో కూడా అవకాశాలు క్యూకట్టాయి.

ఛలో సినిమాతో రష్మిక మందన్నా టాలీవుడ్‌కు పరిచయం చేసారు దర్శకుడు వెంకీ కుడుముల. అలా తనకు టాలీవుడ్ అవకాశాన్ని ఇచ్చిన వెంకీ కుడుముల అంటే రష్మికకు ప్రత్యేక అభిమానం. అందుకే భీష్మ సినిమాలో చేయమని అడిగిన వెంటనే రష్మిక ఒప్పేసుకున్నారట.

అయితే తాజాగా వెంకీ కుడుముల బర్త్ డే జరిగింది. వెంకీ కుడుముల పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ సెలెబ్రిటీలు అమద్రు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందించారు. కానీ రష్మిక మాత్రం ఎప్పుడో రాత్రి ఆలస్యంగా విష్ చేశారు. దింతో ఆయన అభిమానులకు ఎందుకు రష్మిక ఇంత వరకు విష్ చేయలేదో అర్దం కాలేదు. అందుకే ఆ దర్శకుడికి రష్మిక సారీ చెపుతూ.. ఆలస్యంగా విష్ చేయడానికి గల రీజన్ చెప్పుకొచ్చారు. రష్మిక ప్రస్తుతం బన్నీ తో పుష్ప సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అటవీ ప్రాంతంలో షూటింగ్, సిగ్నల్స్ లేని కారణంగానే ముందుగా విష్ చేయలేకపోయాను అని దర్శకుడిని క్షమించమని రష్మిక అడిగేశారు.

రష్మిక సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్ను.. అలాగే అమితాబ్ తో గుడ్ బాయ్ సినిమాలకు ఓకే చెప్పి సంతకాలు చేసింది. మరో వైపు తమిళంలో కూడా వరుసగా సినిమాలను చేస్తుంది ఈ బ్యూటీ. టాలీవుడ్ లో వరుస అవకాశలతో దూసుకుపోతుంది క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న. యంగ్ హీరో శర్వానంద్‌ ప్రధాన పాత్రలో కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news