Moviesటాలీవుడ్ మోస్ట్ రోమాంటిక్ కపుల్ వీళ్లే..ఏం చేసారో చూడండి..!!

టాలీవుడ్ మోస్ట్ రోమాంటిక్ కపుల్ వీళ్లే..ఏం చేసారో చూడండి..!!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్..ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు సినిమా .. హిట్ అయిన, ఫ్లాప్ అయిన ఈయన మాత్రం సినిమాలు చేస్తునే ఉంటారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ యంగ్ హీరో.. ఈ ఏడాదిలోని ఇప్పటికే రెండు సినిమాలను విడుదల చేసారు.. అందులో చెక్ సినిమా ఆశించనంతగా హిట్ కాకపోగా.. ఇటీవలే విడుదలైన రంగ్ దే మూవీ పాజిటివ్ టాక్‏తో సొంతంచేసుకుంది.

ఇదిలా ఉండగా… ముచ్చటగా మూడో చిత్రాన్ని వీలైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై “మాస్ట్రో” అనే సినిమా చేస్తున్న నితిన్.. సరసన ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటిస్తుండగా.. మిల్కీబ్యూటీ తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తోందట.

సినిమా పరంగా బిజీగా ఉన్నా.. తన భార్యకు టైం ఇస్తారు నితిన్. అయితే నితిన్ ప్రస్తుతం తన భార్య షాలినీతో కలిసి మాల్దీవులకు వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. గత ఏడాది జూలై 26న ఈ ప్త్రేమజంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలో ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరిని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకోవాలని ఈ జంట మాల్దీవులకు చెక్కేసారు. అక్కడే బాగా ఎంజాయ్ చేసిన ఈ జంట..వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలను షాలినీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసేవారు.

అయితే ఇప్పుడు మాల్దీవులకు గుడ్ బై చెప్పి.. మళ్లీ వచ్చే ఏడాది కలుస్తామన్నట్టుగా షాలినీ పోస్ట్‌ను బట్టి అర్దమౌతుంది. ఇక ఆ పోస్ట్‌లో నితిన్ షాలిని మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మొత్తానికి పెళ్లి అయిన ఏడాదికి హనీమున్ వెళ్లిన ఈ జంటను చూసి.. నెటిజన్స్ మోస్ట్ రొమాంటిక్ కపుల్ అని కామెంట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news