Gossipsభర్త హిట్ కోసం భార్యని రంగంలోకి దించుతున్న రాజమౌళి.. బొమ్మ దద్దరిల్లాల్సిందే..??

భర్త హిట్ కోసం భార్యని రంగంలోకి దించుతున్న రాజమౌళి.. బొమ్మ దద్దరిల్లాల్సిందే..??

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత మ‌హేష్ న‌టిస్తోన్న ఈ సినిమాపై లెక్క‌కు మిక్కిలిగా అంచ‌నాలు ఉన్నాయి. మ‌హేష్ మూడు వ‌రుస హిట్ల‌తో ఫుల్‌స్వింగ్లో ఉన్నాడు. దీంతో స‌ర్కారు వారి పాట హిట్ అయితే మ‌హేష్ క్రేజ్ ఏ రేంజ్‌కు వెళ్లిపోతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్రస్తుతం మహెష్ బాబు ఈ సినిమా షూటింగ్‌ లో బిజీ బిజీగా ఉన్నారు.

ఈ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా కూడా పూర్తయిన తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు తెలిసిందే. మహేష్ తో సినిమా చేయబోతున్నాను అంటూ స్వయంగా రాజమౌళినే అన్నారు. ఇక అప్పటి నుండి ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ కోసం మహేష్ అభిమానులు ఆతౄతగ ఎదురుచుస్తున్నారు.

అయితే సినీ ఇండస్ట్రీ నుండి అముతున్న సమాచారం ప్రకారం..ఈ బడా ప్రాజెక్ట్ లో.. మహేష్ సతీమణి నమ్రత ఓ కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్త హట్ టాపిక్ గా మారింది. నిజానికి నమ్రత మంచి నటి.. పెళ్లికి ముందు తానంటే ఏంటొ ప్రూవ్ చేసుకుంది. కానీ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీని చూసుకుంటుంది. మహేష్ స్పెషల్ రిక్వెస్ట్ చేసి మరీ ఈ సినిమా కోసం నమ్రతను ఒప్పించినట్లు తెలుస్తుంది. నమ్రత అభిమానుల కోసం మళ్లీ కెమెరా ముందుకు వస్తే మాత్రం.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ పకా అని చెప్పవచ్చు. ఇక ఈ జంట బొమ్మ దద్దరిల్లాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news