Newsమొబైల్ చార్జ‌ర్‌తో భ‌ర్త‌ను చంపిన భార్య‌... కోర్టు వేసిన శిక్ష ఇదే..

మొబైల్ చార్జ‌ర్‌తో భ‌ర్త‌ను చంపిన భార్య‌… కోర్టు వేసిన శిక్ష ఇదే..

ఓ న్యాయ‌వాది అయిన మ‌హిళ త‌న భ‌ర్త‌ను చంపిన ఆరోప‌ణలు రుజువు కావ‌డంతో పశ్చిమబెంగాల్‌లోని 24 పరగణాల జిల్లా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు, న్యాయవాది అనిందితా పాల్‌కి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అనిందితా పాల్ త‌న భ‌ర్త ర‌జ‌త్ డేని మొబైల్ ఫోన్ చార్జ‌ర్ కేబుల్ మొడ‌కు చుట్టి చంపేసింది. ఈ ఆరోప‌ణ‌లు నిజం కావ‌డంతో ఆమెకు కోర్టు ఈ శిక్ష విధించింది.

 

అద‌న‌పు జిల్లా సెష‌న్స్ జ‌డ్జి సుజిత్ కుమార్ ఆమెకు జీవిత ఖైదుతో పాటు రూ.10000 జరిమానా విధించారు. ఇక ఈ కేసులో సాక్ష్యం మాయం చేసేందుకు ప్ర‌య‌త్నించిన నేప‌థ్యంలో ఆమె కోర్టు అద‌నంగా మ‌రో యేడాది పాటు జైలు శిక్ష విధించింది. రెండు తీర్పులు ఏకకాలంలో విధించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news