టీవీ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో బుధవారం మరో అప్డేట్ జరిగింది. శ్రావణి మరణించినప్పటి నుంచి నిర్మాత అశోక్రెడ్డి పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న దేవరాజ్ రెడ్డి, సాయిలను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏ 3 నిందితుడిగా ఉన్న అశోక్రెడ్డి పరారీలో ఉండగా పోలీసులు అన్వేషిస్తున్నారు.
ఈ రోజు ఉదయం అశోక్రెడ్డి తనంతట తానుగా పోలీసులకు లొంగిపోయారు. అశోక్ రెడ్డి, మొదట తాను నిర్మించిన ప్రేమతో మీ కార్తీక్ సినిమాలో శ్రావణికి చిన్న అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకు దగ్గరై వారి కుటుంబ అవసరాలు కూడా తీర్చారు. తర్వాత తనను వివాహం చేసుకోవాలని శ్రావణిని అశోక్ రెడ్డి వేధింపులకు గురి చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.
ఇక అశోక్రెడ్డి పంజాగుట్ట ఏసీపీ ఎదుట పొలీసులకు లొంగిపోయినట్టు తెలుస్తోంది. ఇక ఆర్ఎక్స్ 100 హీరో కార్తీకేయకు అశోక్రెడ్డి స్వయానా బాబాయ్. ప్రేమతో కార్తీక్, ఆర్ఎక్స్ 100, 90 ఎంఎల్ సినిమాలని ఈయన నిర్మించాడు.