Newsజ‌గ‌న్ ప్ర‌భుత్వంపై స్వామిజీల ఆగ్ర‌హం... ఆ మంత్రికి సిగ్గుందా అంటూ సూటి...

జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై స్వామిజీల ఆగ్ర‌హం… ఆ మంత్రికి సిగ్గుందా అంటూ సూటి ప్ర‌శ్న‌…

ఏపీలో హిందూ దేవాల‌యాల్లో జ‌రుగుతోన్న దాడుల‌పై ఏపీ సాధుప‌రిష‌త్ అధ్య‌క్షుడు శ్రీనివాసానంద స‌ర‌స్వ‌తీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంద్ర‌కిలాద్రి క‌న‌క‌దుర్గ  అమ్మ‌వారి ర‌థం, వెండి విగ్ర‌హాలు మాయం కావ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం అవుతున్నాయి. దేవాల‌యాల్లో సీసీ కెమేరాలు ఏమ‌య్యాయ‌ని ప్ర‌శ్నించిన ఆయ‌న ఈ సంఘ‌ట‌న‌పై కూడా సీబీఐ విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేశారు.

 

 

రాష్ట్రంలో హిందూ దేవాల‌యాల‌పై ఇన్ని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నా సీఎం, దేవాదాయ శాఖా మంత్రి ఎందుకు స్పందించ‌డం లేద‌ని ?  ఇన్ని ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నా దేవాదాయ శాఖా మంత్రికి సిగ్గులేదా ?  అని ప్ర‌శ్నించారు. ఈ ప్ర‌భుత్వం మైనార్టీల కోస‌మే ఉందా ?  జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో హిందువులు లేరా ?   వారు ఎందుకు మాట్లాడ‌డం లేద‌ని శ్రీనివాసానంద స‌ర‌స్వ‌తీ ఫైర్ అయ్యారు.

 

ఇదిలా ఉంటే విజ‌య‌వాడలో నిడ‌మ‌నూరులో సాయిబావా విగ్ర‌హాన్ని ఎవ‌రు గుర్తు తెలియ‌ని దండుగులు ధ్వంసం చేయ‌డంతో సాయిబాబా భ‌క్తులు కూడా తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news