Newsజ‌గ‌న్‌కు గుడ్ న్యూస్‌.. కుమార్తెకు ఫారిన్ బిజినెస్ స్కూల్లో సీటు

జ‌గ‌న్‌కు గుడ్ న్యూస్‌.. కుమార్తెకు ఫారిన్ బిజినెస్ స్కూల్లో సీటు

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు గుడ్ న్యూస్ వ‌చ్చేసింది. ఆయ‌న పెద్ద కుమార్తె హ‌ర్షా రెడ్డికి ప్ర‌ఖ్యాత ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు సాధించింది. ఫారిస్‌లోని ప్ర‌ఖ్యాత యూనివ‌ర్సిటీల్లో ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ కూడా ఒక‌టి. హ‌ర్షా రెడ్డి ఇప్పుడు పారిస్ క్యాంప‌స్‌లోనే మాస్ట‌ర్స్ డిగ్రీ చ‌ద‌వ‌నున్నారు. హ‌ర్షా రెడ్డి గ‌తంలో కూడా లండ‌న్ వ‌ర్సిటీలోనూ మంచి ర్యాంక్‌తో ప్రీ సీటు సాధించి చ‌దువుకున్న సంగ‌తి తెలిసిందే. లండ‌న్‌లో ఆమె  స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ లో గ్రాడ్యుయేషన్‌ చదివింది.

హ‌ర్షా రెడ్డి ముందు నుంచే చ‌దువులో టాప్ ర్యాంక‌ర్‌. ఇప్పుడు ఆమెకు ప్ర‌ఖ్యాత వ‌ర్సిటీలో సీటు రావ‌డంతో జ‌గ‌న్‌తో పాటు కుటుంబం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. రేపు హ‌ర్షా రెడ్డి పారీస్ వెళ్ల‌నున్నారు. ఇక జ‌గ‌న్‌తో పాటు కుటుంబం మొత్తం రేపు బెంగ‌ళూరు వెళ్లి అక్క‌డ నుంచి ఆమెను పారీస్‌కు పంప‌నున్నారు. ఇక జ‌గ‌న్‌కు ఇద్ద‌రూ కూడా కుమార్తెలే అన్న విష‌యం తెలిసిందే. ఇక ఈ ఇద్ద‌రూ కూడా గ‌త మార్చి నెల‌లోనే విదేశాల నుంచి తిరిగి వ‌చ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news