Moviesతెలుగు డైరెక్టర్‌ను ఆడుకుంటున్న బాలీవుడ్!

తెలుగు డైరెక్టర్‌ను ఆడుకుంటున్న బాలీవుడ్!

టాలీవుడ్‌లో దర్శకుడు దేవా కట్ట తెరకెక్కించిన ప్రస్థానం చిత్రం సూపర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో శర్వానంద్, సాయికుమార్‌ల నటనకు జనాలు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ చేసిన పర్ఫార్మెన్స్‌ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ అని అంటారు. ముఖ్యంగా ఆ సినిమాలోని డైలాగులు జనాలు నీరాజనాలు పట్టారు. ఈ సినిమాను ప్రస్తుతం బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు దేవా కట్టా.

బాలీవుడ్‌ ప్రస్థానంలో సంజయ్ దత్ లీడ్ రోల్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేయగా.. దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాకు బాలీవుడ్‌లో అప్పుడే కష్టాలు వచ్చి పడుతున్నాయి. తెలుగు ప్రస్థానం రీమేక్ హక్కులను ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ షెమారూ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ కంపెనీ నిర్మాత సంజయ్ దత్‌కు లీగల్ నోటీసులు కూడా పంపింది. దీంతో ఈ సినిమా రిలీజ్‌ కష్టాల్లో పడింది.

అయితే తెలుగు దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాపై బాలీవుడ్‌లో మంచి అంచనాలు క్రియేట్ కావడంతోనే ఇలాంటి సమస్యలు సృష్టిస్తున్నారంటూ సౌత్ వాళ్లు అంటున్నారు. ఏదేమైనా తెలుగు దర్శకుడు తెరకెక్కించిన చిత్రం బాలీవుడ్‌లోనూ తన ప్రస్థానం సాగించాలని తెలుగు ఆడియెన్స్ కోరుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news