Gossipsచేసిన పనికి క్షమపణ చెప్పిన మహేష్..!

చేసిన పనికి క్షమపణ చెప్పిన మహేష్..!

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్‌తో పాటు, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు తనతో మూవీస్ తీసిన దర్శకులందరినీ తెగ పొగిడేశారు.

తనను హీరోగా పరిచయం చేసిన రాఘవేంద్ర రావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ.. ‘రాజకుమారుడు’, ‘ఒక్కడు’, ‘అతడు’, ‘శ్రీమంతుడు’,‘భరత్ అను నేను’ సినిమాల గురించి చెబుతూ..చివరగా ‘మహర్షి’డైరెక్టర్ వంశి పైడిపల్లి తనకు సోదరుడి లాంటివాడని చెప్పాడు. ఈ సినిమాకోసం తన డేట్స్ గురించి రెండేళ్లు ఆగాడని..సినిమా చాలా బాగా వచ్చిందని అన్నారు. అంతా బాగుంది కానీ..మహేష్ కెరీర్ ని మలుపు తిప్పిన ‘పోకిరి’, ‘బిజినెస్ మాన్’ సినిమా గురించి కానీ, డైరెక్టర్ గురించి కానీ ఒక్క మాట మాట్లాడలేదు. దాంతో సినీ వర్గాల్లో నే కాదు ఫ్యాన్స్ లో కూడా నిరాశ కలిగింది.

ఈ విషయం మొత్తానికి మహేష్ కి తెలియడంతో వెంటనే స్పందించాడు…ట్విట్టర్ వేదికగా పూరీకి క్షమాపణ చెప్పాడు. ‘ఇవాళ నా స్పీచ్‌లో ఇంపార్టెంట్ పర్సన్ పేరు చెప్పడం మర్చిపోయాను. పోకిరి నన్ను సూపర్ స్టా‌ర్‌ని చేసింది. పోకిరిలాంటి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్యూ సో మచ్ పూరీ.. ఈ సినిమా నాకెప్పటికీ గుర్తుండిపోతుంది’ అని ట్వీట్ చేసాడు మహేష్. దానికి వెంటనే పూరి కూడా స్పందంచారు..థ్యాంక్యూ సో మచ్ సార్, ఆల్వేస్ లవ్ యూ, మహర్షి ట్రైలర్ ఈజ్ రాకింగ్’.. అంటూ, మహేష్ ట్వీట్‌కి రిప్లై ఇచ్చాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news