Gossipsరష్మిక కన్నీరు పెట్టేలా చేసిన దర్శకుడు..!

రష్మిక కన్నీరు పెట్టేలా చేసిన దర్శకుడు..!

రష్మిక మందన్న ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ కొట్టింది. ఆ తర్వాత పరుశరామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘గీతాగోవిందం’సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. దాంతో ఈ అమ్మడికి తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నాయి. కన్నడ బ్యూటీ రష్మిక ఓ వైపు కన్నడలో నటిస్తూనే ఇత భాషల్లో నటిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన..తాను కన్నీరు పెట్టుకున్న విషయం గురించి చెప్పింది. అయితే షాక్ అవకండీ..ఆ కన్నీటి కథ వెనుక ఓ ఫన్నీ స్టోరీ కూడా చెప్పింది రష్మిక.

గీతా గోవిందం సినిమా షూటింగ్ సమయంలో ఓ రోజు సెట్స్ లోకి రష్మిక ఎంట్రీ ఇచ్చిందట..అక్కడ ఉన్న తన సహనటులు, టెక్నీషియన్స్ ఆమెతో ఎవరూ మాట్లాడకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారట..మందలించినా పలకకపోవడంతో రష్మికు చాలా సిగ్గు అనిపించిందట..అంతే కాదు ఒక్కసారే దుఖఃం పొంగుకొచ్చిందట..అంతే పక్కకు వెళ్లి కన్నీరు పెట్టుకోవడంత..సడెన్ గా డైరెక్టర్ పరుశరామ్ ఆమె వద్దకు వచ్చి..అసలు విషయం చెప్పడంతో రష్మిక షాక్ తిన్నదట.

ఇంతకీ అసలు విషయం ఏంటేంటే..ఓ సీన్ కోసం రష్మిక కన్నీరు పెట్టుకోవాల్సి ఉంటుంది..అయితే ఆ సీన్ ఆమెతో నేచురల్ గా చేయించడానికే తన టీమ్ అలా చేసిందని..ఆ సీన్ చాలా బాగా వర్క్ ఔట్ అయిందని చెప్పింది. మొత్తానికి తన జీవితంలో మరువలేని సంఘటన అంటుంది రష్మిక మందన.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news