Gossipsచేతులారా కెరీర్ ని నాశనం చేసుకున్న సాయి ధరంతేజ్..

చేతులారా కెరీర్ ని నాశనం చేసుకున్న సాయి ధరంతేజ్..

మెగా మేనళ్లుడు సాయి ధరం మొదట్లో హిట్లు అందుకున్నా ఇప్పుడు తన కెరియర్ సందిగ్ధంలో పడింది. వరుసగా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపులను అందుకున్న సాయి ధరం తేజ్ తన లాస్ట్ మూవీ తేజ్ ఐలవ్యూ తర్వాత కొద్ది గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరక్షన్ లో చిత్రలహరి సినిమా చేస్తున్నాడు తేజూ. ఈ సినిమాలో తేజ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కనిపిస్తాడటని తెలుస్తుంది. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా చర్చలు జరుపుతున్నాడట సాయి ధరం తేజ్.

ఒక సినిమాకు టైం కేటాయించి ఆ సినిమా అయ్యాక మరో సినిమా చేయకుండా ఛాన్సులు వస్తున్నాయి కదా అని వరుసగా చేస్తూ వెళ్లాడు తద్వారా ఫ్లాపులు మూటకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు మెగా మేనళ్లుడు కెరియర్ చిరు, అరవింద్ ల చేతుల్లోకి వెళ్లింది. తేజూ కెరియర్ మీద వారు దృష్టి పెట్టారని తెలుస్తుంది. అయితే చిత్రలహరి సినిమా తర్వాతే తేజ్ తర్వాత సినిమా ఉంటుందట. ఈమధ్యనే పిల్ల జమిందార్ అశోక్ తేజూకి ఓ కథ చెప్పాడట. ఆ లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకు రమ్మని చెప్పాడట సాయి ధరం తేజ్.

ఈ ఇయర్ భాగమతి సినిమాతో హిట్ అందుకున్న అశోక్ మరోసారి అలాంటి థ్రిల్లర్ కథతోనే వస్తున్నాడట. చూస్తుంటే తేజ్ ఈసారి కరెక్ట్ ట్రాక్ లోనే ఉన్నాడని అనిపిస్తుంది. కిశోర్ తిరుమల డైరక్షన్ లో చిత్రలహరి ఎలాగు క్రేజీ మూవీగా వస్తుంది. తప్పకుండా ఈ సినిమా అంచనాలను అందుకుంటుందని అంటున్నారు. ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్న ఈ సినిమా సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news