Gossipsరంగస్థలం-2 కి రంగం సిద్ధం.. టైటిల్ కూడా అలానే..!

రంగస్థలం-2 కి రంగం సిద్ధం.. టైటిల్ కూడా అలానే..!

ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో మొదటిగా నిలిచిన సినిమా రాం చరణ్ రంగస్థలం. ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లను రాబట్టి రాం చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా స్పూర్తితో ఎన్నో సినిమాలు పిరియాడికల్ డ్రాంగా తెరకెక్కించేలా చూస్తున్నారు. లేటెస్ట్ గా అలాంటి అటెంప్ట్ చేస్తున్నాడు యువ హీరో శర్వానంద్.

ప్రస్తుతం పడి పడి లేచే మనసు సినిమా చేస్తున్న శర్వానంద్ ఆ సినిమా తర్వాత వేణు ఊడుగుల డైరక్షన్ లో ఓ క్రేజీ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు విరాట పర్వం 1992 అనే టైటిల్ పెడుతున్నారట. సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని ఎంపిక చేశారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ జోడి పడి పడి లేచే మనసు సినిమాలో నటిస్తుంది.

విరాట పర్వం 1992 సినిమా రంగస్థలం లానే పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారట. కచ్చితంగా రంగస్థలం చూపిన మార్గంలోనే ఈ సినిమా కూడా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర కూడా క్రేజీగా ఉంటుందట. ఆల్రెడీ ఫిదాలో పల్లెటూరి పిల్లగా అలరించిన సాయి పల్లవి విరాట పర్వం 1992లో ఎలా ఉంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news