Moviesఆనందో బ్రహ్మ.. అసలు లాభం నిర్మాతలకే..!

ఆనందో బ్రహ్మ.. అసలు లాభం నిర్మాతలకే..!

తాప్సీ ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, షకలక శంకర్, తాగుబోతు రమేష్ లు నటించిన సినిమా ఆనందో బ్రహ్మ. మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అన్నిచోట్ల భారీ వసూళ్లను రాబడుతుంది. హర్రర్ నేపథ్యంలోనే వచ్చిన ఈ సినిమా కథ కథనాలు కొత్తగా ఉండటంతో ప్రేక్షకులు సినిమాను సూపర్ హిట్ చేశారు.

ముఖ్యంగా ఈ సినిమా మౌత్ టాక్ తో ఎక్కువ పబ్లిసిటీ సంపాదించింది. సినిమా ఉన్న నమ్మకంతో సినిమాను రెండు మూడు ఏరియాలు మాత్రమే అమ్మేసిన నిర్మాతలు మిగతా చోట్ల సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకున్నారట. సినిమా బడ్జెట్ మొత్తం శాటిలైట్ ద్వారానే రాబట్టిన ఆనందో బ్రహ్మ ఆ సినిమా నిర్మాతలకు మూడు నాలుగు రెంట్లు లాభాలను తెచ్చిపెడుతుందట.

3 కోట్ల లోపే సినిమాను పూర్తి చేయగా సినిమాను జీ తెలుగు వారు 3 కోట్లకు శాటిలైట్ రైట్స్ కొన్నారు. ఇక డిస్ట్రిబ్యూటర్ కు అమ్మిన మొత్తమే కాదు డైరెక్ట్ గా రిలీజ్ చేసిన సెంటర్స్ లో వస్తున్న లాభాలు కూడా నిర్మాతలకు చేరుతాయట. మొత్తానికి 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు ఆనందో బ్రహ్మతో అదిరిపోయే హిట్ అందుకున్నారని తెలుస్తుంది. మొదటి ప్రయత్నం భలే మంచి రోజు పర్వాలేదు అనిపించగా సెకండ్ సినిమా అంచనాలకు మించి వసూళ్లను రాబట్టి నిర్మాతలను సంతోషపెడుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news