Newsమహేష్ కోసం అక్కడకెళ్ళి మరి కష్టపడుతున్న డైరక్టర్..!

మహేష్ కోసం అక్కడకెళ్ళి మరి కష్టపడుతున్న డైరక్టర్..!

సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం తర్వాత మురుగదాస్ డైరక్షన్ లో స్పైడర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శ్రీమంతుడు కాంబినేషన్ లో కొరటాల శివతో భరత్ అను నేను మూవీ చేస్తున్న మహేష్ ఆ తర్వాత వంశీ పైడిపల్లి సినిమా చేస్తాడని తెలిసిందే. ఊపిరి సినిమా తర్వాత అఖిల్ సినిమా ఛాన్స్ వచ్చినా ఎందుకో సరిగా వాడుకోలేని వంశీ పైడిపల్లి మహేష్ తో సినిమాకు సిద్ధమయ్యాడు.

సక్సెస్ ట్రాక్ కలిగిన ఈ డైరక్టర్ మహేష్ ఇచ్చిన అవకాశాన్ని అన్నివిధాలుగా వినియోగించుకోవాలని చూస్తున్నాడు. అందుకే ఈ కథ కోసం అమెరికా వెళ్లి మరి సిట్టింగ్ లో కూర్చుంటున్నాడట. కథ మొత్తం అక్కడ ఫినిష్ చేసి వచ్చాడట. దిల్ రాజుతో పాటుగా అశ్వనిదత్ ఈ సినిమా నిర్మాణంలో భాగమవుతున్నారని తెలుస్తుంది. భారీ బడ్జెట్ లో నిర్మించే ఈ సినిమా మహేష్ కెరియర్ లో డిఫరెంట్ మూవీ అవుతుందని చెబుతున్నాడు వంశీ.

ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా నటించే అవకాశాలున్నాయని టాక్. మొత్తానికి వంశీతో మహేష్ సినిమా పట్టాలెక్కబోతుంది. ఈ సినిమా 2018 సమ్మర్ లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news