Gossipsఎన్టీఆర్, రవితేజల డైరెక్టర్స్ ‘మలుపు’ భలేగుంది!

ఎన్టీఆర్, రవితేజల డైరెక్టర్స్ ‘మలుపు’ భలేగుంది!

After one year gap Mass maharaja Raviteja has given green signal to do a movie to director who is actually very keen to work with NTR. He also tried to impress with his different storyline but don’t know what happened ntr rejected him. Another twist is that, the director who is almost confirmed to Raviteja project and have to go on floors is working with NTR.

‘బెంగాల్ టైగర్’ తర్వాత మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోతాడనుకుంటే.. ఏ ఒక్క చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకెళ్ళలేదు. ఒప్పుకున్న ఐదు చిత్రాలు అటకెక్కాయి. దిల్‌రాజుతో చేయాల్సిన ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జరుపుకుంది కూడా. కానీ.. రెమ్యునరేషన్ విషయంలో ఇద్దరిమధ్య తలెత్తిన విభేదాల కారణంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఇక రీసెంట్‌గా బాబీతో సెట్స్ మీదకి కంపల్సరీ వెళ్తాడనుకుంటే.. ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇవ్వడంతో ఇంకా లాంచ్ కాకముందే ఆ చిత్రం ఆగింది.

ఇలా ఏడాదికాలం నుంచి ప్రతి సినిమా ఆగిపోతూ వస్తుండడంతో.. రవితేజ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు ఉంటుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తూ వస్తున్నారు. ఇప్పుడా ఘడియలు వచ్చేసినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. దిల్‌రాజు నిర్మాణంలోనే రవితేజ ఓ సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇదివరకే వీరి కాంబోలో ఓ మూవీ రావాల్సింది కానీ.. ఏ కారణం వల్లనో అది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా కానున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రానికి ‘పటాస్’, ‘సుప్రీమ్’లాంటి సూపర్‌హిట్ చిత్రాలను తెరకెక్కించిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహించబోతున్నాడు.

‘సుప్రీం’ తర్వాత బాలయ్య, రామ్, ఎన్టీఆర్‌లాంటి హీరోల్ని ట్రై చేశాడు కానీ.. వారిలో ఎవరితోనూ సెట్స్ మీదకి వెళ్ళలేకపోయాడు. తాజాగా అతను రవితేజకు కథ వినిపించి.. గ్రీన్ సిగ్నల్ వేయించుకున్నాడట. ఈ అనిల్‌కి దిల్‌రాజు బేనర్లోనే మరో రెండు సినిమాల కమిట్మెంట్ ఉంది కాబట్టి.. అతని నిర్మాణంలోనే సినిమా చేయాల్సి ఉంటుందని రవికి చెప్పాడట. దాంతో.. ముగ్గురూ చర్చలు జరిపి, చివరికి సెట్స్ మీదకి వెళ్ళడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి ఓ అధికారిక ప్రకటన రానుందని, వచ్చే ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నట్లు టాక్.

విశేషం ఏమిటంటే.. ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని అనిల్ ఎంతో ప్రయత్నించాడు. అతనికోసం ఓ డిఫరెంట్ స్టోరీని ప్రిపేర్ చేశాడు కూడా. కానీ.. అతను మాత్రం చేయనని చెప్పేసి, బాబీని సెలెక్ట్ చేసుకున్నాడు. మరోవైపు.. బాబీ కూడా రవితేజతో సినిమా చేయాల్సింది. దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే ప్రారంభోత్సవం జరపుకుందామనుకునేలోపే.. ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. దీంతో.. అతను ఎన్టీఆర్‌కి ఓ కథ చెప్పి, అతనితో సినిమా ఓకే చేయించుకున్నాడు. ఈ మలుపు భలేగుంది కదూ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news