Moviesసోషల్ మీడియాలో "గుంటూరు కారం" పై ఇంత ట్రోలింగ్ జరుగుతున్న .....

సోషల్ మీడియాలో “గుంటూరు కారం” పై ఇంత ట్రోలింగ్ జరుగుతున్న .. మహేష్ బాబు పట్టించుకోకపోవడానికి ఏకైక రీజన్ ఇదే..!!

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో గుంటూరు కారం సినిమాకు సంబంధించి ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా ఎప్పుడు ఓ రేంజ్ లో పొగిడేసే మహేష్ బాబును కూడా అభిమానులు కూసింత దారుణంగానే ట్రోల్ చేశారు. ఇలాంటి డైరెక్టర్లకు ఎందుకు అవకాశం ఇస్తున్నావు బాసు అంటూ కొందరు.. మరికొందరు ఇక నువ్వు మారవా అంటూ చాలా నీచంగా మాట్లాడారు .

ఇలాంటివి చాలా మీమ్‌స్.. ట్రోల్స్ గుంటూరు కారం టీం కూడా చూశారు. అయినా సరే మహేష్ బాబు మాత్రం వీటిపై ఎక్కడా కూడా పరోక్షంగా కూడా రిప్లై ఇవ్వలేదు.. కౌంటర్ వేయలేదు . దానికి కారణం ఆయనకు సూపర్ స్టార్ కృష్ణ చెప్పిన మాటలే అంటూ తెలుస్తుంది . “మనం బాగుపడుతూ ఉంటే చూసి సంతోషించే వాళ్ళ కన్నా ఏడ్చేవాళ్ళు ఎక్కువ.. మనల్ని చూసే ఏడ్చే వాళ్ల గురించి మనం ఆలోచించకూడదు ‘..

“అలాంటివి వదిలేస్తూ ఉండాలి. మన పని మనం చూసుకో పోవాలి ..మనకి ఎక్కడ సంతోషం ఉంటుందో ..అలాంటి వాళ్ళనే మన చుట్టూ పెట్టుకోవాలి “అంటూ ఎప్పుడూ చెబుతూ ఉండేవారట . అంత పాజిటివ్ మైండ్ కాబట్టే మహేష్ బాబు ఇలాంటి ట్రోలింగ్స్ ని పట్టించుకోవట్లేదు అంటున్నారు ఆయన అభిమానులు. ప్రసెంట్ మహేశ్ బాబు జర్మనీ లో ఉన్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news