Movies"గుంటూరు కారం" నుంచి పూజా హెగ్డేను ఎందుకు తప్పించారో తెలుసా..? సినిమా...

“గుంటూరు కారం” నుంచి పూజా హెగ్డేను ఎందుకు తప్పించారో తెలుసా..? సినిమా రిలీజ్ అయ్యాక బయటపడ్డ నిజం..!!

మనకు తెలిసిందే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో మొదటగా హీరోయిన్గా పూజ హెగ్డే అని అనుకున్నారు . అయితే ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఆమెను ఈ సినిమా నుంచి తప్పించారు . ఆ తర్వాత ఆమె స్థానంలోకి శ్రీలీల వచ్చింది . అయితే గుంటూరు కారం సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా కూడా మీనాక్షి చౌదరి బిస్కెట్ క్యారెక్టర్ అని చెప్పాలి .

నాలుగంటే నాలుగు షాట్లు మినహా ఎక్కడ కూడా ఆమె కనిపించలేదు. అసలు ఆమె సినిమాలో హీరోయిన్ అని చెప్పడం కన్నా సైడ్ ఆర్టిస్ట్ అనడం మేలు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అదేవిధంగా శ్రీలీల కూడా పెద్ద చించేసే క్యారెక్టర్ అని చెప్పలేం.. ఏదో గ్లామర్ కోసం పెట్టాడు ..డాన్స్ ఇరగదీయించాడు అంతే .. ఈ క్రమంలోనే శ్రీలీల పాత్రలో పూజ హెగ్డే పెట్టుంటే..

శ్రీలీల లాగా ఆమె డాన్స్ చేస్తుండేది కాదు అని ..శ్రీలీల బొంగరం లా గిరగిరా డాన్స్ చేసేసింది అని ..ఆ స్టామినా మన పూజా హెగ్డే కూడా లేదు అని.. ఆ కారణంగానే పూజా హెగ్డేను ఈ సినిమా నుంచి తప్పించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అన్న కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి . సినిమా రిలీజ్ అయ్యాక ఇదే న్యూస్ మరోసారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news