Movies"గుంటూరు కారం" విషయంలో జరిగిన ఏకైక తప్పు అదే.. నాగ వంశీ...

“గుంటూరు కారం” విషయంలో జరిగిన ఏకైక తప్పు అదే.. నాగ వంశీ సెన్సేషనల్ కామెంట్స్..!!

గుంటూరు కారం .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ పేరు ఎలా వైరల్ అయిందో మనం చూసాం . టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా 12వ తేదీ రిలీజ్ అయి బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొట్టేసింది. రిలీజ్ అయిన వారం రోజుల్లోనే 212 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రీజినల్ సినిమాల్లో ఇప్పటివరకు ఏ మూవీ క్రియేట్ చేయనటువంటి రికార్డ్స్ క్రియేట్ చేసింది . అత్యధిక వసూళ్లు చేసిన రీజనల్ సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసి పెట్టింది మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం”.

ఈ విజయం పై చిత్ర యూనిట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ రోజు కొంచెం నెగిటివ్ టాక్ వచ్చాయి ..రివ్యూలు బాగోలేవు అని సోషల్ మీడియాలో పలువురు సినిమా పై చెత్తగా వాగారు .. ఇవన్నీ మనకు తెలిసిందే . అయితే రీసెంట్గా సినిమా ప్రొడ్యూసర్ నాగ వంశీ మాట్లాడుతూ ..”తమ సినిమా మంచి కలెక్షన్ సాధించింది అని ..ఈ విజయానికి కారణం మహేష్ బాబు అభిమానులు అని చెప్పుకొచ్చారు “. అంతేకాదు ఈ సినిమా మొదట్లో నెగిటివ్ టాక్ తెచ్చుకుంది అని ప్రాఫిట్స్ వచ్చినా కూడా టాక్ ప్రకారంగా కొంచెం అసహనంగా జనాలు మాట్లాడారని సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ మేము పట్టించుకోమని చెప్పుకొచ్చారు .

“అంతేకాదు ఈ సినిమాకి అర్ధరాత్రి బెనిఫిట్ షోలు వేయడం మైనస్ అయింది అని ..సినిమా ఫ్యామిలీ పరంగా ఎమోషన్ పరంగా ఉండడంతో అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షో లు వేయడం మా సైడ్ నుంచి జరిగిన తప్పు అని అనుకుంటున్నామని చెప్పుకొచ్చారు . ఫాన్స్ ఫుల్ మాస్ సినిమా అనుకున్నారు. 1 కి వచ్చేవాళ్లంతా అలాగే అనుకోని వచ్చారు . మాస్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉండేసరికి తీసుకోలేకపోయారు . అంతే తేడా బహుశా మేము అర్ధరాత్రి షోలు వేయకపోయి ఉంటే సినిమాకి ఆ నెగటివ్ టాక్ కూడా వచ్చేది కాదేమో “అంటూ సినిమా విషయంలో జరిగిన తప్పుని ఓపెన్గా ఒప్పేసుకున్నాడు నాగవంశీ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news