Newsఆ హీరోయిన్ చనిపోవడం వల్లే..జయం సినిమాలో సదాను తీసుకున్నారా..? ఇన్నాళ్లకు...

ఆ హీరోయిన్ చనిపోవడం వల్లే..జయం సినిమాలో సదాను తీసుకున్నారా..? ఇన్నాళ్లకు బయటపడిన అస్సలు నిజం..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయలోకం.. రంగుల ప్రపంచం.. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు .. ఒక సినిమా కోసం ఒక హీరోని హీరోయిన్ అనుకున్నాక.. వాళ్లు కమిట్ అయ్యాక .. ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి . అయితే కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే అలా జరుగుతూ ఉంటుంది . సరిగ్గా అలా జరిగే హీరోయిన్ సదా కెరియర్ టాప్ రేంజ్ లోకి వెళ్లిపోయింది.

నితిన్ హీరోగా సదా హీరోయిన్గా తెరకెక్కిన సినిమా జయం . తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఎన్నో అవార్డులను కొల్లగొట్టింది . కాగ ఈ సినిమా కోసం ముందుగా హీరోయిన్ గా ప్రత్యూషను అనుకున్నారట మేకర్స్ . ఆమె కూడా ఓకే చేసిందట . అయితే ఆ తర్వాత ఆమె అనుకోని విధంగా సూసైడ్ చేసుకొని మరణించింది .

ఆమె మరణించడంతో అదే ఫేస్ కట్ క్వాలిటీస్ ఉన్న బ్యూటీ సదాను ఈ సినిమాలోకి తీసుకున్నారు . ఈ విషయం గురించి స్వయాన ప్రత్యూష తల్లి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చింది . అలా హీరోయిన్ గా ప్రత్యూష కి రావాల్సిన ఆ అవకాశం సదా దక్కించుకొని స్టార్ హీరోయిన్గా మారింది . ఒకవేళ ప్రత్యూష బ్రతికి ఉంటే కచ్చితంగా ఆ ఆఫర్ సదా కి వచ్చుండేది కాదు . ఇంత పెద్ద హీరోయిన్ అయి ఉండేది కాదు..అని జనాలు చెప్పుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news