News' నువ్వు నేను ' అనిత కెరీర్ ఎందుకు నాశనం అయ్యింది...?

‘ నువ్వు నేను ‘ అనిత కెరీర్ ఎందుకు నాశనం అయ్యింది…?

దర్శకుడు తేజ ఇండస్ట్రీలో తన ప్రతీ సినిమాతో దాదాపు 40 నుంచి 50 మంది వరకూ కొత్త నటీనటులను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. వారిలో ముఖ్యంగా హీరోహీరోయిన్స్ కూడా ఉన్నారు. రీమాసేన్, ఉదయ్ కిరణ్, అనిత, సదా, సుమన్ శెట్టి, నవదీప్, నితిన్, కాజల్ అగర్వాల్, అభిరాం దగ్గుబాటి..ఇలా ఎంతో మందిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

వీరందరూ పెద్ద స్టార్స్ అయ్యారు. కొందరు అవకాశాలు లేక ఫేడవుట్ అయ్యారు. తేజ హీరోయిన్స్ గా పరిచయం చేసిన వారిలో అనిత, సదా, రీమా సేన్ లాంటి వారు ఇప్పుడు కనిపించడం లేదు. ముఖ్యంగా అనిత, రీమాసేన్ అయితే అడ్రస్ లేరు. సదా బుల్లితెరమీద సందడి చేస్తుంది. అయితే, నువ్వు నేను సినిమాతో పరిచయమైన అనిత మొదటి సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా మారింది.

ఈ సినిమా తర్వాత అనిత తెలుగులో శ్రీరాం, నిన్నే ఇష్టపడ్డాను లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాల్సిన అనిత పనికిమాలిన కథలను ఎంచుకుంది. అదే సమయంలో టాలీవుడ్ హీరోతో షికార్లు కొడుతూ కెరీర్ మీద దృష్టిపెట్టలేదట. దాంతో అనిత యంగ్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలను కోల్పోయింది.

లేదంటే అనిత ఫిజిక్ కి కొన్నేళ్ళు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగేది. ఆ తర్వాత చాలాకాలానికి నాగార్జున, అనుష్క, ప్రియమణి నటించిన రగడ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసి తళ్లుక్కున మెరిసింది. ఫిజిక్ లో పెద్ద తేడా కనిపించలేదు. చెప్పాలంటే అనిత కి ఇప్పుడు యంగ్ హీరోల సరసన అవకాశం ఇచ్చిన బాగానే ఉంటుంది. కానీ, ఒకసారి షెడ్డుకెళ్ళిన బండి ఎంత రంగేసుకున్నా పాతదే కదా. అనిత పరిస్థితి కూడా అంతే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news