Newsసాయిప‌ల్ల‌విని ఏడిపించిన టాలీవుడ్ స్టార్ హీరో... షూటింగ్ నుంచి క‌న్నీళ్ల‌తో అవుట్‌...!

సాయిప‌ల్ల‌విని ఏడిపించిన టాలీవుడ్ స్టార్ హీరో… షూటింగ్ నుంచి క‌న్నీళ్ల‌తో అవుట్‌…!

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి తన కెరీర్ విషయంలో ఎప్పుడు ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటుంది. మంచి కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా సాయి పల్లవి కథల విషయంలో ఎప్పుడు రాజీ పడదు. అందుకే ఆమెకు భాషలకు అతీతంగా లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు. అయితే సాయి పల్లవి టాలీవుడ్ క్రేజీ హీరో చేసిన పనికి ఎంతో బాధపడింది.. కన్నీళ్లు తుడుచుకుంటూ షూటింగ్ స్పాట్ నుంచి వెళ్ళిపోయింది కూడా..!

ఈ విష‌యం అప్ప‌ట్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఆ హీరో ఎవరో ? కాదు నేచురల్ స్టార్ నాని. నాని కెరీర్ లోనే వన్ ఆఫ్ ద హిట్ సినిమాగా నిలిచింది ఎంసీఏ సినిమా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2017 చివర్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది.

ఈ సినిమా షూటింగ్ టైంలో సాయి పల్లవికి – నానికి మధ్య ఇగోలు, పంతాలు నడిచాయి. ఎవరికి వారు తామే గొప్ప అన్నట్టుగా బిహేవ్ చేయడం.. చివరికి ఆ గొడవలు పెరిగి పెద్దవి కావటం జరిగాయట. చివ‌ర‌కు నాని బాగా ఇబ్బంది పెట్ట‌డంతో బాగా హ‌ర్ట్ అయిన సాయిప‌ల్ల‌వి షూటింగ్ స్పాట్ నుంచే ఓ రోజు వెళ్లిపోయి త‌ర్వాత షూటింగ్‌కు కూడా రాలేదట‌.

చివ‌ర‌కు నిర్మాత దిల్ రాజుతో పాటు ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ ఇద్ద‌రూ జోక్యం చేసుకుని, నాని, సాయిప‌ల్ల‌విని కూర్చోపెట్టి ఇష్యూను సెటిల్ చేయించారు. చివ‌ర‌కు నానితోనే సాయిపల్లవికి సారీ చెప్పించార‌ట‌. అలా అప్ప‌ట్లో జ‌రిగిన ఈ ఇష్యూ టాలీవుడ్‌లో పెద్ద సెన్షేష‌న‌ల్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news