Moviesచిరంజీవి తలచుకుంటే ఆ పని ఎంత.. ఆ ఒక్క కారణంతోనే ఆగిపోతున్నాడా..?

చిరంజీవి తలచుకుంటే ఆ పని ఎంత.. ఆ ఒక్క కారణంతోనే ఆగిపోతున్నాడా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తలా తొక్క లేని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పూటకో పది అయినా సరే స్టార్ సెలబ్రెటీస్ గురించి నానా రకాలుగా ట్రోల్ చేస్తూ ఉంటారు ట్రోలర్స్. అందులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది మెగా ఫ్యామిలీ . సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కనీసం మనం పది వార్తలు మెగా ఫ్యామిలీకి సంబంధించిన గాసిప్స్ వింటూ ఉంటాం . మెగా కోడలు ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఆ వార్తలు మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి.

గతంలో శ్రీజను టార్గెట్ చేసిన మెగా ట్రోలర్స్ ఇప్పుడు మెగా కోడలు ఉపాసన ని టార్గెట్ చేస్తూ.. ఆమెకు సంబంధించిన విషయాలను ట్రెండ్ చేస్తున్నారు . కాగా ఈ మధ్యనే ప్రెగ్నెంట్ అయిన ఉపాసన.. త్వరలోనే కవల పిల్లలకు జన్మనివ్వబోతుందన్న న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా ఇలాంటి ఫేక్ వార్తలు పై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అందరిలాగ మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి ఫేక్ వార్తలు పుట్టించే వాళ్ల పై లీగల్ గా యాక్షన్ తీసుకోగలరు అని..ఆయనకు ఉన్న స్టేటస్ కి, స్టామినాకి అది పెద్ద విషయం కాదు అని..ఆయన తలుచుకుంటే చిటికెలో ఆ పని జరిగిపోతుందని..కానీ అలాంటి వాళ్ళ జీవితాలను నాశనం చేయకూడదని ..మెగాస్టార్ పెద్ద మనసుతో తమ కుటుంబం పై ఎంత వల్గర్ కామెంట్స్ చేస్తున్న.. తమ కుటుంబ ఆడవాళ్ళపై ట్రోల్స్ చేస్తున్నా కానీ సైలెంట్ గా ఉన్నాడు .

ఆ కారణమే లేకపోయి ఉంటే ఇప్పటికే మెగా ఫ్యామిలీని ట్రోల్ చేసేవాళ్లను జైల్లో పెట్టించుండేవాడు అంటూ మెగా ఫాన్స్ చెప్పుకు వస్తున్నారు . ఏమాటుకు ఆ మాట మెగాస్టార్ తలుచుకుంటే ఆ పని ఎంతసేపు చెప్పండి. ఫేక్ వార్తలను కొట్టి పడేయడం..అలాంటి వార్తలు పుట్టించే వాళ్లని లోపల పడేయటం.. కానీ ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఇలాంటివన్నీ కామన్ అంటూ లైట్ తీసుకున్నాడు చిరంజీవి అన్నది మాత్రం వాస్తవం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news