Moviesకృష్ణం రాజు మరణంతో ప్రభాస్ తీసుకున్న నిర్ణయానికి దండం పెట్టేసిన శ్యామలాదేవి..నువ్వు...

కృష్ణం రాజు మరణంతో ప్రభాస్ తీసుకున్న నిర్ణయానికి దండం పెట్టేసిన శ్యామలాదేవి..నువ్వు గ్రేట్ డార్లింగ్..!?

టాలీవుడ్ సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్య కారణంగా బాధపడుతున్న కృష్ణంరాజు..ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కాగా ఈయన మరణం తీరని లోటు అంటూ సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయన మరణం పై సంతాపం ప్రకటించారు . అంతేకాదు ఆయన ఆత్మ ఎక్కడున్న శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంటూ సోషల్ మీడియా ద్వారా తమకు కృష్ణంరాజుతో ఉన్న అనుబంధం గురించి స్నేహబంధం గురించి చెప్పుకొచ్చారు.

కాగా కృష్ణంరాజు మరణం ప్రభాస్ కు తీరని లోటు అనే చెప్పాలి. ప్రభాస్ ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది కృష్ణంరాజే. అంతే కాదు కెరియర్ మొదట్లో ప్రభాస్ సినిమాల ఎంపికల విషయంలో తప్పుటడుగులు వేస్తున్న.. టైం లో ప్రభాస్ కెరియర్ ని హిట్ హీరో ల లిస్టులోకి తీసుకొచ్చిన కృష్ణంరాజు ..ఆ తర్వాత ఆయనతో కలిసి సినిమాలో నటించి మెప్పించారు. పలు ఇంటర్వ్యూలలో ..స్టేజిలపైన ప్రభాస్ కృష్ణంరాజుకి ఎంత విలువిస్తారో ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు. కాగా ఇప్పుడు కృష్ణం రాజు ఇకలేరు అనే మరణ వార్తను ప్రభాస్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణించి దాదాపు ఆరు రోజులు కావస్తున్న ఇంకా ప్రభాస్ ఆ విషాదఛాయల్లోనే మునిగిపోయారు . రీసెంట్ గా ప్రభాస్ తీసుకున్న డెసిషన్ రెబెల్ అభిమానుల్లో కంగారు పెట్టిస్తుంది.

మనకు తెలిసిందే పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీస్తున్న ప్రభాస్.. ప్రజెంట్ సలార్ మూవీలో ప్రాజెక్టు కె మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ అయిపోగానే ప్రభాస్ మారుతి కాంబోలో రాబోతున్న సినిమా షూటింగ్ లోను పాల్గొనాలి. కాగా ఇలా సడెన్ గా కృష్ణంరాజు మరణించడంతో.. ప్రభాస్ అన్ని షూటింగులను దాదాపు మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడట . ప్రశాంత నీల్ కి ..నాగ్ అశ్విన్ కి.. మారుతికి మూడు నెలలపాటు ఎటువంటి షూటింగ్ షెడ్యూల్ పెట్టుకొని అంటూ కరాఖండిగా చెప్పేసారట.

మనకు తెలిసిందే పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీసే ప్రభాస్ ఒక్కరోజు కాల్ షీట్లు మిస్ అయితేనే కోట్లలో నష్టం వస్తుంది . మరి దాదాపు మూడు నెలల పాటు సినిమా షూటింగ్ లు బంద్ చేస్తే ..ఎంత నష్టం కలుగుతుందో.. మన ఊహించుకోవచ్చు. అంతేకాదు ఈ మూడు నెలల్లో ప్రభాస్ కృష్ణంరాజు పూర్తి చేయాల్సిన పనులను ..ఇంటి పెద్దదిక్కుగా బాధ్యతగా తీసుకొని కృష్ణంరాజు కూతుర్లను లైఫ్ లో సెటిల్ చేయాలని ఆలోచిస్తున్నాడట. ఇంతవరకు ఇంటికి పెద్దదిగా ఉన్న కృష్ణంరాజు ఇకపై లేకపోవడంతో ప్రభాస్ పెద్ద దిక్కుగా మారి చెల్లెల పెళ్లి పై దృష్టి పెట్టడంతో తో శ్యామలాదేవి ప్రభాస్ కి చేతులు జోడించి దండం పెట్టేసిందట. ” నువ్వు నా కడుపున పుట్టకపోయిన.. నువ్వే నా కొడుకు” అంటూ ఎమోషనల్ అయిపోయిందట. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news