Moviesపూరి దంప‌తుల విడాకులు... అస‌లేం ఏం జ‌రిగిందో చెప్పిన ఆకాశ్‌..!

పూరి దంప‌తుల విడాకులు… అస‌లేం ఏం జ‌రిగిందో చెప్పిన ఆకాశ్‌..!

ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌, ఆయ‌న భార్య లావ‌ణ్య విడిపోతున్నారంటూ గత కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం అయితే జ‌రుగుతోంది. వీరి మ‌ధ్య గ్యాప్‌న‌కు హీరోయిన్ ఛార్మీ కార‌ణ‌మ‌న్న టాక్ కూడా ఉంది. ఈ ప్ర‌చారంపై పూరి త‌న‌యుడు, న‌టుడు ఆకాశ్ పూరి స్పందించాడు. ఆకాశ్ తాజాగా న‌టించిన చోర్‌బ‌జార్ సినిమా ఈ నెల 24న రిలీజ్ అవుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఇంట‌ర్వ్యూలో హోరెత్తిస్తున్నాడు.

ఈ ఇంట‌ర్వ్యూలో ఆకాశ్ మాట్లాడుతూ త‌న‌కు చిన్న‌ప్ప‌టి నుంచే సినిమాలు అంటే పిచ్చి అని.. సినిమాల కోసం తాను చ‌దువు కూడా మానేశాన‌ని చెప్పాడు. ఇక్క‌డ హీరోగా స‌క్సెస్ కాక‌పోతే చివ‌ర‌కు లైట్‌బాయ్‌గా అయినా ప‌నిచేస్తానే కాని.. ఇండ‌స్ట్రీ నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌కూడ‌దు అన్న ఉద్దేశంతోనే తాను సినిమాల్లోకి వ‌చ్చాన‌ని చెప్పాడు.

ఇక ఓ టైంలో మా ఆస్తులు అన్నీ పోయాయి.. అన్ని అమ్మేశారు.. ఇళ్లు కూడా అమ్మేశారు. ఆ ప‌రిస్థితి నుంచి మ‌ళ్లీ ఈ స్థితికి మేం వ‌చ్చామ‌ని ఆకాశ్ ఉద్వేగంతో చెప్పాడు. ఇక మీ త‌ల్లిదండ్రులు విడిపోతున్నార‌న్న వార్త‌ల‌పై స్పందించాల‌ని కోర‌గా అవ‌న్నీ అబ‌ద్ధాలే అని చెప్పాడు. తాము ప‌త‌న ద‌శ నుంచి ఈ రోజు ఈ స్థాయికి రావ‌డానికి కార‌ణం అమ్మే అని.. త‌మ‌కు అంతా అమ్మే అని చెప్పాడు.

మా అమ్మ‌, నాన్న‌ది ప్రేమ వివాహం అని.. అమ్మ‌ను పెళ్లి చేసుకోవాల‌నుకున్న‌ప్పుడు నాన్న ఫోన్ చేసి నేను నిన్ను పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్నాను.. నా చేతిలో రు. 200 మాత్ర‌మే ఉన్నాయి.. రేపు నా భ‌విష్య‌త్తు ఎలా ? ఉంటుందో ? కూడా తెలియ‌దు. అన్నా కూడా అమ్మ వెంట‌నే నేను వ‌చ్చేస్తున్నాను అని చెప్పి వెళ్లి నాన్న‌ను పెళ్లి చేసుకుంది.

అస‌లు ఇది వింటే అమ్మాయిలు ఇంత‌లా కూడా ప్రేమిస్తారా ? అని తాను ఆశ్చ‌ర్య‌పోయాన‌ని.. మా క‌ష్టంలో.. సుఖంలో అమ్మ ఎప్పుడూ వెన్నంటే ఉంది. వాళ్లు ఎప్పుడూ క‌లిసే ఉంటారు.. తాము సంతోషంగా ఉన్నాం.. కొంద‌రుం ఏం చేయాలో తెలియ‌క ఈ పుకార్లు పుట్టిస్తార‌ని పూరి చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news