Moviesస‌ర్వం పోయినా పూరీని వ‌ద‌ల‌ని ఛార్మీ.. గాఢ‌మైన స్నేహం వెన‌క ముచ్చ‌ట...

స‌ర్వం పోయినా పూరీని వ‌ద‌ల‌ని ఛార్మీ.. గాఢ‌మైన స్నేహం వెన‌క ముచ్చ‌ట ఇదే..!

అప్పుడెప్పుడో 2002లో భీమినేని శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో దీప‌క్ హీరోగా వ‌చ్చిన నీతోడు కావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చింది ఛార్మీ. ఆ టైంలో ఛార్మీ వ‌య‌స్సు 1 7 -18 మ‌ధ్య‌లోనే..! తొలి సినిమా యావ‌రేజ్‌.. ఛార్మీ బాగుందే అన్న టాక్ అయితే వ‌చ్చింది. ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు. పంజాబీ ముద్దుగుమ్మ అయిన ఛార్మీ రెండు ద‌శాబ్దాలుగా టాలీవుడ్‌లో తిష్టవేసి ఇక్క‌డే సెటిల్ అయిపోయింది.

ఆ త‌ర్వాత తెలుగులో స్టార్ హీరోలు అంద‌రితోనూ ఛార్మీ న‌టించింది. రెండు ద‌శాబ్దాల కెరీర్‌లో ఛార్మీ ఎన్నో ఎత్తు ప‌ల్లాలు చూసింది. అయితే ప్ర‌స్తుతం ఈ ముదురు ముద్దుగుమ్మ చాలా ఛాలెంజింగ్ రోల్ తీసుకుని చేస్తోంది. ఏకంగా నిర్మాత‌గా మారి స్టార్ హీరోల‌తో భారీ బ‌డ్జెట్ సినిమాలు చేస్తోంది. ఛార్మీకి సినిమాలు అయిపోయాయి.. ఆమె ఇక పెళ్లి చేసుకుని పంజాబ్ వెళ్లిపోవ‌చ్చు అనుకుంటోన్న టైంలో ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌తో ప‌రిచ‌యం ఆమె కెరీర్‌ను ఒక్క‌సారిగా ట‌ర్న్ చేసేసింది.

ఈ క్ర‌మంలోనే ఆమెకు ఎన్నో క‌ష్టాలు, అవ‌మానాలు, ఆర్థికంగా క‌ష్టాలు, ఆరోప‌ణ‌లు, డ్ర‌గ్స్ కేసులు ఇవ‌న్నీ ఆమెను చుట్టు ముట్టేశాయి. ఇక పూరి – ఛార్మీ బంధం గురించి కూడా ర‌క‌ర‌కాల గాసిప్‌లు మామూలు అయిపోయాయి. అదే టైంలో పూరి కూడా.. ఛార్మీ బంధానికి లొంగిపోయాడ‌న్న ప్ర‌చార‌మే వినిపించింది. ఛార్మీతో క్లోజ్‌గా ఉన్న టైంలోనే టెంప‌ర్ త‌ర్వాత ఒక‌టి కాదు.. రెండు కాదు ఏకంగా ఆరు ప్లాపు సినిమాలు వ‌చ్చాయి.

అస‌లు స్టార్ హీరోలు పూరితో సినిమా కాదు క‌దా.. క‌నీసం అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు కూడా నిరాక‌రించారు. బాల‌య్య లాంటి హీరో మాత్ర‌మే పూరితో సినిమా చేశాడు. ఎట్ట‌కేల‌కు రామ్‌తో పూరి – ఛార్మీ క‌లిసి తీసిన ఇస్మార్ట్ శంక‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు రు. 70 కోట్లు కొల్ల‌గొట్టింది. దీంతో వీరి అప్పులు అన్నీ తీరిపోయాయి. జ్యోతిల‌క్ష్మి సినిమా టైంలోనే ఛార్మీకి – పూరికి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. త‌ర్వాత ఈ స్నేహం ముదిరిపోయి వీరిద్ద‌రు ఒక‌రిని విడిచి.. మ‌రొక‌రు ఉండలేని స్టేజ్‌కు వ‌చ్చేశారు.

జ్యోతిల‌క్ష్మి ప్లాప్ త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్‌తో క‌లిసి నిర్మాత‌గా సినిమాలు చేసి ప్లాప్ కావ‌డంతో చివ‌ర‌కు వీళ్లు ఇద్ద‌రు రోడ్డు మీద‌కు వ‌చ్చేశారు. పూరీకి వ‌రుస‌గా ఆరు ప్లాపులు. అటు పూరి ఫ్యామిలీలో కూడా ఛార్మీ వ‌ల్ల క‌ల‌త‌లు అంటూ ప్ర‌చారం. దీనికి తోడు ఇద్ద‌రిపై డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఈ ఆరోప‌ణ‌ల‌కు మ‌రింత బ‌లం ఇచ్చిన‌ట్లు అయ్యింది. ఆ టైంలో వీరు విడిపోతార‌న్న ప్ర‌చార‌మూ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయినా బ‌లంగా క‌లిసి ఆస్తులు తాక‌ట్టు పెట్టేసి ఇస్మార్ట్ శంక‌ర్ చేశారు.

ఆ సినిమా హిట్‌తో తిరుగులేకుండా పోయింది. ఇక ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాన్ ఇండియా సినిమా లైగర్ తెరకెక్కించారు. ఈ సినిమాకి నిర్మాత కరణ్ జోహార్ భాగస్వామ్యం కావడంతో పాన్ ఇండియా ఇమేజ్ వ‌చ్చింది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఇప్పుడు మై హోమ్ వాళ్ల‌తో క‌లిసి అదే విజ‌య్‌తో జ‌న‌గ‌ణ‌మ‌న సినిమా తెర‌కెక్కిస్తున్నారు. అలా పూరి – ఛార్మీ బంధం రోజు రోజుకు మ‌రింత స్ట్రాంగ్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news