Moviesఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌కు రాజ‌మౌళి ఇంత పెద్ద షాక్ ఇచ్చాడే..!

ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌కు రాజ‌మౌళి ఇంత పెద్ద షాక్ ఇచ్చాడే..!

అదేంటో కానీ రాజ‌మౌళి అస‌లు ఎప్ప‌ట‌కి క‌లిసి సినిమా చేస్తాయ‌ని ఎవ్వ‌రూ ఊహించ‌ని రెండు విభిన్న క్యాంప్‌ల‌కు చెందిన హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌ను క‌లిపి మ‌ల్టీస్టార‌ర్ సినిమా తీశారు. అస‌లు ఈ కాంబినేష‌న్ సెట్ అవుతుంద‌ని గ‌త 20 ఏళ్ల‌లోనే ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. పైగా ఈ ఇద్ద‌రు క్రేజీ స్టార్స్ డేట్లు ఏకంగా మూడేళ్ల పాటు లాక్ చేసి… వీళ్లు మ‌రే సినిమా తీయ‌కుండా చేశాడు. ఈ సినిమాపై ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమా అభిమానులే కాకుండా.. ఇత‌ర భాష‌ల‌కు చెందిన అభిమానులు సైతం ఎంతో ఉత్కంఠ‌తో వెయిట్ చేసేలా చేశాడు.

అలాంటిది రాజ‌మౌళికి ఇప్పుడు హైద‌రాబాద్‌లో ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ ప్రి రిలీజ్ ఈవెంట్ చేయ‌డం చాలా క‌ష్టం అయిపోయింది. అందుకే హైద‌రాబాద్‌లో ప్రి రిలీజ్ ఫంక్ష‌న్ చేయ‌డం లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. సినిమా రిలీజ్‌కు గట్టిగా మ‌రో 17 రోజుల టైం మాత్ర‌మే మిగిలి ఉంది. ఓ వైపు ప్ర‌మోష‌న్లు హోరెత్తుతున్నాయి. ఇక త్రిబుల్ ఆర్ ప్రి రిలీజ్ ఈవెంట్ అంటే క‌నీసం ల‌క్ష‌మంది ప‌ట్టే వెన్యూ కావాల‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇద్ద‌రూ కూడా టాప్ హీరోలే..!

అటు నంద‌మూరి, ఇటు మెగా కాంపౌండ్‌ల‌కు చెందిన హీరోలు కావ‌డంతో అభిమానులు మామూలుగా రారు. మ‌రోవైపు సినిమా మీద అంచ‌నాలు ఆకాశంలో ఉన్నాయి. ఇక్క‌డ ఫంక్ష‌న్ చేయాలంటే ఇద్ద‌రు హీరోల అభిమానుల‌కు స‌మానంగా ప్రాధాన్య‌త ఇవ్వాల్సి ఉంటుంది. పాస్‌ల విష‌యంలోనూ స‌మాన న్యాయం చేయాలి.. ఏ మాత్రం తేడా వ‌చ్చినా ఎవ‌రో ఒక‌రు ఈగోల‌కు పోవ‌డం ఖాయం. అది రాజ‌మౌళికి లేనిపోని త‌ల‌నొప్పి అవుతుంది.

ఇక ఇద్ద‌రు హీరోల అభిమానుల కోసం వేల‌ల్లోనే పాస్‌లు అవ‌స‌రం అవుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకు అదిరిపోయే బ‌జ్ తీసుకువ‌చ్చేందుకు రాజ‌మౌళి ఏకంగా బాల‌య్య – చిరంజీవిని సైతం ఒకే వేదిక మీద‌కు తీసుకు రావాల‌ని అనుకున్నారు. ఈ టైంలో అభిమానులు వేల‌ల్లోనే త‌ర‌లి వ‌స్తార‌ని అంచ‌నా.. అందుకు త‌గిన పోలీస్ బ‌ల‌గం కావాలి… ఈ ఈవెంట్ నిర్వ‌హించ‌డం అంటే క‌త్తిమీద సామే. అందుకే తాత్కాలికంగా హైద‌రాబాద్ ఈవెంట్‌ను ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఈ ఈవెంట్ ర‌ద్ద‌యితే ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌కు పెద్ద షాకే అనుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news