Moviesసిగ‌రెట్ పెట్టె చెప్పిన‌.. సీనియ‌ర్ ఎన్టీఆర్ `పిసినారి` క‌థ‌..!

సిగ‌రెట్ పెట్టె చెప్పిన‌.. సీనియ‌ర్ ఎన్టీఆర్ `పిసినారి` క‌థ‌..!

విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌముడు.. అన్న‌గారు నంద‌మూరి తార‌క‌రామారావు ప్ర‌తిభ గురించి అంద‌రికీ తెలి సిందే. ప్ర‌పంచం మొత్తం ఆయ‌న‌ను గుర్తించింది. ఇక‌, భార‌త సినీ రంగంలో ఆయ‌న వేసిన ప్ర‌తి అడుగు రికార్డును సృష్టించింది. అయితే.. ఆయ‌న ఎంత పేరు తెచ్చుకున్నా.. ఆయ‌న వెనుకే.. ఒక కామెంట్ నీడ‌లా వెంటాడింది. అదే.. `ఎన్టీఆర్ పిసినారి` అని! అస‌లు ఇది ఎందుకువ‌చ్చింది? ఎలా బ‌య‌ట‌కు పొక్కింది? అనే విష‌యాలు ఆస‌క్తిగా ఉన్నాయి.

 

అడ‌వి రాముడు సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. అయితే.. ఈ సినిమాను చింత‌ప‌ల్లి అడ‌వీ ప్రాంతాని కి ద‌గ్గ‌ర‌లో చిత్రిస్తున్నారు. అయితే.. ఇక్క‌డ చ‌లి.. ఎక్కువ‌. దీనిని త‌ట్టుకునేందుకు అన్న‌గారు.. చాలానే ఇబ్బంది ప‌డ్డారు. అప్ప‌టికే ఆయ‌న‌కు అల‌వాటు ఉన్న‌.. సిగ‌రెట్లు త‌ప్ప‌.. ఇంకేవీ.. త‌న‌ను చ‌లి నుంచి కాపాడ‌లేవ‌ని అనుకున్నారో.. ఏమో.. అన్న‌గారు.. జేబులో ఉన్న రెండు సిగ‌రెట్ పెట్టెల‌ను ఖాళీ చేశారు. ఇంకా.. సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. పైగా.. చ‌లి ముదురుతోంది.

ఈ స‌మ‌యంలో ఆయ‌న షూటింగ్‌లో ఉన్న బోయ్ ని పిలిచి.. సిగ‌రెట్ పెట్టి తీసుకుర‌మ్మ‌ని ఓ 10 రూపాయ లు ఇచ్చారు. అప్ప‌ట్లో గోల్డ్ ఫ్లేక్ కింగ్ సిగ‌రెట్ పెట్టి 8 రూపాయ‌ల 75 పైస‌లు. ఆ బోయ్‌.. సిగ‌రెట్ పెట్టి తీసుకువ‌చ్చి.. అన్న‌గారు.. ఉన్న రూంలోకివెళ్లి.. అక్క‌డ పెట్టి వ‌చ్చేశాడు. అప్ప‌టికి అన్న‌గారు.. షూటింగ్ లో ఉన్నారు. స‌రే… అంతా ప్యాక‌ప్ చెప్పేశారు. అన్న‌గారు రూంకు వ‌చ్చారు. టేబుల్‌పై సిగ‌రెట్ పెట్టె ఉంది. కానీ, మిగిలిన చిల్ల‌ర క‌నిపించ‌లేదు.

దీంతో ఆయ‌న వెంట‌నే మేనేజ‌ర్‌ను పిలిచి.. బోయ్ ఎక్క‌డా! అని గ‌ద్దించారు. అంతే! ఇంకేముంది.. ఏదో జ‌రిగిపోయింద‌ని.. భావించిన‌,.. డైరెక్ట‌ర్‌, నిర్మాత స‌హా.. అంద‌రూ పొలో మంటూ.. అన్న‌గారి రూమ్ ద‌గ్గ‌ర‌కు ప‌రిగెత్తుకు వ‌చ్చారు. వారిలో నుంచి బోయ్ కూడా బ‌య‌ట‌ప‌డ్డాడు. అన్న‌గారు బాయ్‌ను ద‌గ్గ‌ర‌కు పిలిచి.. చిల్ల‌రేదీ! అని అడిగేస‌రికి.. చెమ‌ట‌లు ప‌ట్టిన బాయ్‌… జేబులో ఎక్క‌డో దాచుకున్న రూపాయి పావ‌లా తీసి అన్న‌గారి టేబుల్‌పై పెట్టి క్ష‌మాప‌ణ‌లు చెప్పి వెళ్లిపోయాడు.

ఈ సంఘ‌ట‌న అడ‌వి రాముడు షూటింగ్‌లో తీవ్ర చ‌ర్చ‌గా మారింది. అన్న‌గారు పిసినారి అంటూ.. ఆయ‌న వెనుక గుస‌గుస‌లాడుకునేవారు. అయితే.. త‌ర్వ‌త కాలంలో తాతినేని రామారావు సినిమా షూటింగ్‌లో ఉన్న‌ప్పుడు అన్న‌గారు.. దీనిపై వివ‌ర‌ణ ఇచ్చారు. “చిల్ల‌ర నాకు పెద్ద విష‌యం కాదు. కానీ, డ‌బ్బుల విలువ ముఖ్యం. మ‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే వాళ్ల‌కు కూడా డ‌బ్బుల విలువ తెలియాలి. అందుకే అలాచేశా!“ అని చెప్పుకొచ్చార‌ట‌. కానీ, అన్న‌గారిపై ఇటు రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా.. పిసినారి అనే మాట మాత్రం పోలేదు.

అన్న‌గారు ఉమ్మ‌డి రాష్ట్రానికి సీఎం అయ్యాక రూపాయి జీతం తీసుకునేవారు. అయితే ఎన్టీఆర్ డ‌బ్బును వేస్ట్ చేసేందుకు అస్స‌లు ఇష్ట‌ప‌డేవారు కాదు. కానీ అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు.. డ‌బ్బు ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం ఉన్న‌ప్పుడు మాత్రం బాగా ఖ‌ర్చు చేసేవారు. ఇలా.. మొత్తానికి అన్నగారిపై ప‌డ్డ పిసినారి ముద్ర అప్ప‌ట్లో ఆస‌క్తిగా మార‌డం గ‌మ‌నార్హం. ఇదే విష‌యాన్ని బాల‌య్య కూడా అనేక సంద‌ర్భాల్లో చెప్పుకు రావ‌డం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news