Moviesఅలా చేసి తప్పు చేశా..నా పిల్లలు మొహానే అడిగేస్తుంటే బాధేస్తుంది.. రాణీ...

అలా చేసి తప్పు చేశా..నా పిల్లలు మొహానే అడిగేస్తుంటే బాధేస్తుంది.. రాణీ ముఖర్జీ ఓపెన్ కామెంట్స్..!!

రాణి ముఖర్జీ.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తన సినిమాలతో తన అందం తో కుర్రకారుని నిద్ర పోనీకుండా చేసింది. అప్పట్లో ప్రతి హీరోకి అమ్మడునే కావాలి అనే వారంటేనే ఆమె రేంజ్ ఎలా ఉండేదో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఎక్స్ పోజింగ్ విషయంలో అయితే అమ్మడు అస్సలు ఆలోచించదు..డైరెక్టర్ అడిగితే ఎంతైనా చేస్తుంది.


ఒకప్పుడు టాప్‌హీరోయిన్‌గా బాలీవుడ్‌లో వెలిగిన రాణి ముఖర్జీ సల్మాన్‌లో కలిసి ‘బాబుల్‌, హలో బ్రదర్‌, చోరీ చోరీ చుప్కే చుప్కే, కహీ ప్యార్‌ నా హోజాయే, హమ్‌దిల్‌జో ప్యార్‌కరేగా’ వంటి చిత్రాలలో నటించింది. రాణి ముఖర్జీ తన బాలీవుడ్ కెరీర్‌లో అత్యున్నత స్థానంలో ఉన్నప్పుడే యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ అధినేత ఆదిత్యచోప్రాను వివాహం చేసుకుంది. అయితే..అమ్మడు అప్పట్లో చేసిన ఎక్స్ పోజింగ్ క్యారెక్ టర్లు చూసి ఇప్పుడు బాధపడుతుందని చెప్పుకొచ్చింది.

సినిమా మత్తులో ఉన్నప్పుడు .. ఏం చేస్తున్నానో తెలియక బాగా ఎక్స్ పోజింగ్ పాత్రల్లో నటించాను ..ఇప్పుడు ఆ సినిమా లు నా పిల్లలు చూసి..వాట్ మమ్మి నువ్వేనా ఇది..నువ్వు ఇలాంటి సినిమాలు చేశావా అంటూ అంటుంటే బాధేస్తుంది.

దీంతో తన పిల్లలు అడిగిన ఈ ప్రశ్నలకి తాను సమాధానం చెప్పలేకపోయానని ..పెళ్లికి ముందు ఎంత ఎక్స్ పోజింగ్ చేసినా, గ్లామర్ షో చేసినా పెద్దగా అభ్యంతరాలు ఉండవని చెప్పుకొచ్చినా ఆమె అదే పెళ్లయిన తర్వాత మాత్రం ఇలాంటి సన్నివేశాలు మరియు చిత్రాల కారణంగా హీరోయిన్లు మాత్రం ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని క్లారిటి ఇచ్చింది. కాబట్టి బోల్డ్ సన్నివేశాల్లో నటించే ముందు ఒకసారి ఆలోచించుకోవాలని నేటితరం హీరోయిన్లకి సూచించింది బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ రాణీ ముఖర్జీ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news