Moviesమ‌హేష్ సైకిల్‌పై తిరిగేవాడు.. రు. 500 అడ్వాన్స్ ఇచ్చాన‌న్న నిర్మాత‌..!

మ‌హేష్ సైకిల్‌పై తిరిగేవాడు.. రు. 500 అడ్వాన్స్ ఇచ్చాన‌న్న నిర్మాత‌..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. ప‌ర‌శురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే మహేష్ చిన్న సర్జరీ చేయించుకోవడంతో కొన్ని రోజుల పాటు షూటింగ్ కు విశ్రాంతి తీసుకున్నారు. ఈ ఏడాది మహేష్ నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సర్కారు వారి పాటతో పాటు మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల వరుసగా సూపర్ హిట్ సినిమాలతో మహేష్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఇటు సినిమాలతో పాటు అటు ఫ్యామిలీ లైఫ్‌ కూడా మహేష్ బాగా ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మహేష్ వారసులు గౌతమ్, సితార కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. వీరిద్ద‌రు కూడా ఎప్పుడైనా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి.

ఇదిలా ఉంటే రాశీ మూవీస్ అధినేత, సీనియర్ నిర్మాత నరసింహారావు మహేష్ బాబు గురించి కొన్ని విషయాలు తన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. చాలా యేళ్ల క్రితం తాను కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా తీయాలని అనుకున్నాను అని… అయితే అదే సమయంలో శోభన్‌బాబుతో కూడా మరో సినిమా నిర్మిస్తుండటంతో కోడి రామకృష్ణ సినిమా వేరే పార్టనర్ కు ఇచ్చేసినట్లు ఆయన తెలిపారు. ఆ సినిమాను గూడచారి 117 పేరుతో తెరకెక్కించారని… మహేష్ బాబు కూడా అందులో నటించాడని నరసింహారావు తెలిపారు.

ఆ తర్వాత మహేష్ బాబును సోలో హీరోగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో సినిమాలు చెయ్యనివ్వలేదన్నారు. మహేష్ చిన్నప్పుడు తనతో ఎంతో సన్నిహితంగా ఉండే వాడని… చిన్న సైకిల్ వేసుకుని తిరిగే వాడిని… అప్పట్లోనే తాను మహేష్‌తో సినిమా చేయాలని 500 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చానని నరసింహారావు తెలిపారు.

త‌న‌కు డేట్లు రాసివ్వ‌మ‌ని అడిగితే… డేట్లు అంటే ఏంట‌ని ప్ర‌శ్నించాడ‌ని ఆయ‌న చెప్పారు. అయితే ఆ విషయం మహేష్ బాబుకు గుర్తుందో లేదో కానీ… తర్వాత మహేష్ పెద్ద హీరో అయ్యాక ఒకసారి కలిస్తే మంచి సబ్జెక్ట్ తీసుకొని వస్తే సినిమా చేద్దాం అని చెప్పారని నరసింహారావు తెలిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news