Moviesక్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ క్రిష్..ఇది కదా ఫ్యాన్స్ కు కావాల్సింది..!!

క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ క్రిష్..ఇది కదా ఫ్యాన్స్ కు కావాల్సింది..!!

ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్..ఓ వైపు సినిమాలు..మరో వైపు రాజకీయాలు రెండు సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక రీ ఎంట్రీ తరువాత సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టి.. వ‌రుస‌పెట్టి సినిమాలు సెట్స్ మీద‌కు ఎక్కిస్తున్నారు.. టాలీవుడ్ లో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఒక సినిమా పూర్తి కాకముందే మరొక సినిమా కు సైన్ చేస్తూ..కెరీర్ ను బిజీ బిజీ గా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినీ జోరు చూస్తుంటే..రానున్న రోజుల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ కు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ప‌వ‌న్ ఇప్పుడు ఒక‌వైపు భీమ్లానాయ‌క్‌..మ‌రో వైపు హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రాల‌ను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. ఆ వెంట‌నే సురేంద‌ర్ రెడ్డి సినిమా, హ‌రీష్ శంక‌ర్ సినిమాల‌తో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.కాగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పీరియాడిక‌ల్ డ్రామా ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ ఏప్రిల్ 29, 2022న విడుద‌ల కాబోతున్న‌ట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.దీనికి సంబంధించి చిత్రీక‌ర‌ణ కూడా తుది ద‌శ‌కు చేరుకుంది. కొత్త షెడ్యూల్‌ను డైరెక్ట‌ర్ క్రిష్ ఎక్క‌డ చిత్రీక‌రించాలి, ఎలా చిత్రీక‌రించాల‌నే విష‌యాల‌ను ఇప్ప‌టికే ప్లాన్ చేసేశారు.

మొఘ‌ల్ కాలంలో ధ‌నికుల ద‌గ్గ‌ర దోచి, పేద ప్ర‌జ‌ల‌కు పంచి పెట్టి రాబిన్ హుడ్‌గా పేరు తెచ్చుకున్న గ‌జ‌దొంగ క‌థాశంతో పీరియాడిక‌ల్ డ్రామాగా సినిమా రూపొంద‌నుంది. ఇందులో నిధి అగ‌ర్వాల్ పంచ‌మి అనే పాత్ర‌లో న‌టిస్తుంటే, బాలీవుడ్ బ్యూటీ జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తుంది. బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ ఇందులో మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. హైద‌రాబాద్‌లో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు కొత్త షెడ్యూల్ రీస్టార్ట్ అయ్యింది.తాజా షెడ్యూల్‌లో హై ఆక్టేన్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నుండ‌గా..బాలీవుడ్ యాక్ట‌ర్లు అర్జున్ రాంపాల్‌, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో పాల్గొనున్నార‌ని టాక్‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news