Moviesఅలా చెప్పి..అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచేసిన ప్రభాస్..?

అలా చెప్పి..అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌..వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీ బిజీ గా ఉన్నారు. ఇక ప్రభాస్ క్యారెక్టర్ గురించి మనందరికీ తెలిసిందే. స్టార్‌ హీరోగా ఎదిగిన ఇప్పటికీ సింప్లిసిటీని మెయింటెన్‌ చేస్తుంటాడు. అంతేకాదు సెట్‌లో నటీనటులతోపాటు టెక్నీషియన్స్‌తోనూ డార్లింగ్‌ సరదాగా ఉంటాడు. దీంతో అందరు ప్రభాస్ మనస్సు బంగారం అని చెబుతుంటారు. ప్రభాస్ తో సినిమా చేయడానికి కూడా అందరు నటులు ఇష్టపడుతుండడానికి కారణం కూడా ఇదే.

ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రాధేశ్యామ్’ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా త్వరలోనే విడుదల కానుంది. ఇక మరో పాన్ ఇండియా సినిమా ‘సలార్’. ఈ సినిమా కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉంది. ఇక యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న మరో సినిమా ఆదిపురుష్. రామాయ‌ణంలోని ఓ ఘ‌ట్టాన్ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కే ఈ సినిమా ఏకకాలంలో హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న సినిమా. ఈ సినిమా పై ప్రభాస్ అభిమానులు భారి అంచనాలు పెట్టుకున్నారు.

ఇది గాక ప్రభాస్ 23వ సినిమాగా ప్రాజెక్ట్ ఖ్..అలాగే 24వ సినిమా సిద్ధార్ధ్ ఆనంద్‌తో ఉండనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన 25 సినిమా గురించిన ప్రకటన రావడం ప్రభాస్ అభిమానుల్లో ఉన్న ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ప్రభాస్ 25వ సినిమాను అక్టోబర్ 7న అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఇంకా షాకింగ్ ఎమిటంటే ఈ చిత్ర డైరెక్టర్, నిర్మాణ సంస్థ, నటీనటులకు సంబంధించిన అన్ని వివరాలు అదే రోజు తెలుపనున్నారట.దీంతో రెబల్ స్టార్ అభిమానుల్లో క్యూరియాసిటీని మరింత పెంచేసారు. అయితే అసలు విషయం తెలియాలంటే అక్టోబర్ 7 వరకు వేచి చూడాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news