Gossipsచరణ్ కోసం ఆ పాత్ర కి సై.. డేరింగ్ స్టెప్ తీసుకున్న...

చరణ్ కోసం ఆ పాత్ర కి సై.. డేరింగ్ స్టెప్ తీసుకున్న తమన్నా..??

రాం చరణ్..ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం చరణ్ ఉక్రేయిన్ వెళ్ళాడు. ఈ సినిమాలో ఆయన స్వాతంత్య్ర పోరాట యోధులు అల్లురి సీతరామరాజు పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ దసరా పండుగ సమయానికి విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేస్తూనే అటు కొరటాల శివ- చిరంజీవి కాంబోలో రాబోతున్న ‘ఆచార్య’ షూటింగ్ వర్క్స్ ఫినిష్ చేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తైన వెంటనే.. చరణ మరో బడా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను లైన్‌లో రెడీగా పెట్టేశారు. దీంతో ఈ రెండు సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్స్ మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతున్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో “ఆర్‌సి 15” అనే పాన్ ఇండియా మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీని దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ కంప్లీట్ చేసిన శంకర్.. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లాలని అంతా సిద్ధం చేస్తున్నారట.ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు గాను అమె షాకింగ్ రెమ్యునరెషన్ తీసుకుంటున్నట్లు సమాచరం. ఈ భారీ యాక్షన్ డ్రామాలో చరణ్ తో పాటు మరో స్టార్ హీరో కూడా నటించే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో కియారా అద్వానీ తో పాటు మరో హీరోయిన్ కూడా ఉందట. ఆమె ఎవరో కాదు తమన్నా. ఇందులో విలన్ భార్యగా చిత్రాన్ని మలుపుతిప్పే రోల్ చేయనుందని సమాచారం. విలన్ భార్యగా రామ్ చరణ్‌తో ఆమె పెట్టుకునే గొడవలు..ఆమె చెప్పే డైలాగ్స్ టోటల్ సినిమాకే హైలైట్ కానుందని అంటున్నారు. ఇక ఈ క్యారెక్టర్ గురించి శంకర్ చెప్పగానే మిల్కీ బ్యూటీ తమన్నా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చొందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియలో వైరల్ గా మరింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news