Moviesఆ ఒక్కేఒక్క షో సునీత టోటల్ లైఫ్ నే మార్చేసింది..!!

ఆ ఒక్కేఒక్క షో సునీత టోటల్ లైఫ్ నే మార్చేసింది..!!

సునీత.. అందాల తార.. అంతకుమించిన ముధురమైన స్వరం. అమృతం లాంటి గాన మాధుర్యం సింగర్‌ సునీత సొంతం. ఆమె తీయ్యటి గొంతుతో ఒక పాట పాడితే.. మనసుకు హాయిగా ఉంటుంది. స్టార్‌ హీరోయిన్లతో సమానమైన క్రేజ్‌ సంపాదించుకున్న ఏకైక సింగర్‌ సునీత అనే చెప్పాలి.

టాలీవుడ్ సింగర్‌ సునీత తన పాటలతో తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సునీత పాటకు పరవశించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పలకడానికే కష్టంగా ఉండే లైన్లను కూడా ఆమె ఏమాత్రం తత్తరపాటు లేకుండా అవలీలగా పాడేసి సింపుల్‌ అనిపించేస్తుంది.

తన గొంతుతో వందలాది పాటలకు సరికొత్త అందాన్ని తీసుకొచ్చారు. టాలీవుడ్‌లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఆమె సొంతం. ఆమె అందానికి ముగ్ధులు కానివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆమె పాడితే పాటకే అందం వస్తుంది.

ఇప్పటి వరకు తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కలిపి మూడు వేల పైచిలుకు పాటలు పాడింది. ఇలా ఎన్నో గొప్ప లక్షణాలు ఉండటం వల్లే ఆమె ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్‌లో టాప్‌ సింగర్‌గా విరాజిల్లుతోంది. కేవలం గాయనిగానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా,యాంకర్‌గా రాణించింది.

అయితే ఆమె కెరీర్ ని అప్పట్లో ఓ షో మలుపు తిప్పింది. పాడవే కోయిల పేరిట దూరదర్శన్ లో ప్రసారమైన షో తో సునీత క్రేజ్ వచ్చింది. సునీత దూరదర్శన్ షో తర్వాత కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన గులాబీ మూవీలో ‘ఈవేళలో నీవు’ సాంగ్ పాడే ఛాన్స్ వచ్చింది. ఈ సాంగ్ అప్పట్లో ఒక ఊపు ఊపేసింది.

“ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు” పాటతో సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆమె ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఒక్క పాటతో సంగీత అభిమానుల్ని తనవైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో తన శ్రావ్యమైన గొంతుతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల రామ్‌ వీరపనేని అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకున్న ఆమె అప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక సింగర్ సునీత కూతురు కూడా సింగర్ గా ఇండస్ట్రీలో సత్తా చాటాలని చూస్తోంది.

 

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news