Moviesజీన్స్ సినిమా హీరో ప్ర‌శాంత్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..!

జీన్స్ సినిమా హీరో ప్ర‌శాంత్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..!

తెలుగులో తొలిముద్దు సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు తమిళ హీరో ప్రశాంత్. తొలిముద్దు సినిమా దివంగ‌త క్రేజీ హీరోయిన్‌ దివ్యభారతికి ఆఖరు సినిమాజ‌ ఆ సినిమా షూటింగ్ మధ్యలో ఉండగానే దివ్యభారతి మృతిచెందడంతో మిగిలిన పార్ట్‌ను రంభ హీరోయిన్ గా పెట్టి పూర్తి చేశారు. అప్పట్లో ప్రశాంత్ నటించిన సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో విడుదల అప్పట్లో ప్రశాంత్ కు మంచి మార్కెట్ ఉంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ సినిమా ప్రశాంత్ కెరీర్‌ను ఓ రేంజ్ లో ట‌ర్న్‌ చేసింది. ఆ తర్వాత వరుస ప్లాపులతో ప్రశాంత్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది.

 

 

ఈ క్రమంలోనే సినిమా పరిశ్రమకు చెందిన ఓ మహిళను పెళ్లాడిన ప్రశాంత్ ఆమెతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. ప్ర‌శాంత్ తండ్రి ఎవ‌రో కాదు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్యాగ‌రాజ‌న్‌. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ వ‌య‌స్సు 47 సంవ‌త్స‌రాలు. ఈ వ‌య‌స్సులోనూ ప్ర‌శాంత్  యంగ్ ఎన‌ర్జిటిక్‌గా ఉంటున్నాడు. తెలుగులో సెకండ్ ఇన్సింగ్‌గా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన విన‌య విధేయ రామ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్‌కు అన్న‌గా న‌టించాడు.

 

సెకండ్ ఇన్సింగ్స్ అయినా ప్ర‌శాంత్ కెరీర్‌ను ట‌ర్న్ చేస్తుందేమో ?  చూడాలి. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ బాలీవుడ్ హిట్ మూవీ అంధుధాన్‌ను త‌మిళ్‌లో రీమేక్ చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. అంతే కాక ఈ సినిమా రీమేక్ ప‌నుల‌ను ప్ర‌స్తుతం ఓ యంగ్ డైరెక్ట‌ర్‌కు అప్ప‌గించాడ‌ట‌.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news