Gossipsగుంటూరు జిల్లా బ్యాక్‌డ్రాప్‌తో ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ సినిమా‌... హీరోయిన్ ఆమే...

గుంటూరు జిల్లా బ్యాక్‌డ్రాప్‌తో ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమా‌… హీరోయిన్ ఆమే ఫిక్సేనా…!

యంగ్‌టైగ‌ర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా కంప్లీట్ చేసిన వెంట‌నే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ క్రేజీ ప్రాజెక్టు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. చిన‌బాబు, నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా స్టోరీ లైన్ ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ, పీఆర్ టీంల్లోనూ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ సినిమా క‌థ నేప‌థ్యం గుంటూరు జిల్లాలోని ప‌ల్నాడు నేప‌థ్యంలో సాగుతుంద‌ని.. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ అని చెపుతున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ క‌మ‌ర్షియల్ బిజినెస్‌మేన్‌గా క‌నిపిస్తాడ‌ట‌. ఇక మ‌రో షాక్ ఏంటంటే ఎన్టీఆర్ డ్యూయ‌ల్ రోల్లో క‌నిపిస్తాడ‌ని.. ఫ్లాస్‌బ్యాక్‌లో లేదా సెకండాఫ్‌లో రెండో రోల్ ఎంట్రీ ఉంటుంద‌ని అంటున్నారు. ఇక హీరోయిన్ విష‌యానికి వ‌స్తే పూజా హెగ్డే పేరు ముందు అనుకున్నా.. పాన్ ఇండియా రేంజ్‌లో తెర‌కెక్కించాల‌ని చూస్తుండ‌డంతో జాన్వీ క‌పూర్ పేరు బ‌లంగా ప‌రిశీలిస్తున్నార‌ట‌.

ఎన్టీఆర్ సినిమాతో జాన్వీ తెలుగులో ఎంట్రీ ఇస్తే ఆమెకు మంచి లాంచింగ్ అవుతుంది. దీనిపై ఇప్ప‌టికే జ‌రిగిన ఒక‌టి రెండు చ‌ర్చ‌ల్లో బోనీ సైతం జాన్వీని ఎన్టీఆర్ ప‌క్క‌న న‌టింప‌జేసేందుకు ఆస‌క్తితో ఉన్న‌ట్టు బీ టౌన్‌లో వార్త బ‌య‌ట‌కు పొక్కింది. వ‌చ్చే యేడాది మార్చిలో సెట్స్ మీద‌కు వెళ్లే ఈ సినిమాకు అయిన‌ను పోయిరావ‌లె హ‌స్తిన‌కు అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news