Gossipsచిరంజీవి ఎంతమందిని మోసం చేసాడో....శ్రీరెడ్డి కామెంట్స్

చిరంజీవి ఎంతమందిని మోసం చేసాడో….శ్రీరెడ్డి కామెంట్స్

కాస్టింగ్ కౌచ్ అంటూ ఇండస్ట్రీని షేక్ చేసిన శ్రీరెడ్డి అడపాదడపా తన కామెంట్స్ తో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. కాస్టింగ్ కౌచ్ విషయంలో ఆమె దూకుడు తనం చూసి సినిమా పరిశ్రమ అంతా ఒకటై దానికి సంబందించిన ఓ కమిటీని ఏర్పాటుచేశారు. ఆ టాపిక్ ఎండ్ అవడంతో మళ్లీ వ్యక్తిగత విమర్శలకు దిగింది శ్రీరెడ్డి.

లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి మీద సంచలన కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. సినిమాల్లో, రాజకీయాల్లో చిరంజీవి ఎంతమందిని తొక్కేశాడో.. ఎంతమందిని మోసం చేశాడో తన నోటితో చెప్పించొద్దు అని ట్వీట్ చేసింది. ఇక పరోక్షంగా ఆమె పవన్ జనసేన మీద కూడా కామెంట్లు విసిరింది.

ఈసారి అనూహ్యంగా చంద్రబాబు, లోకేషన్ లను పొగడ్తలతో ముంచెత్తింది శ్రీరెడ్డి. చంద్రబాబు పాలన అద్భుతమని.. లోకేష్ ను ఎవరు ఏమి అనొద్దని ఆమె అంటుంది. మరి సడెన్ గా శ్రీరెడ్డి ఈ కొత్త పాట దేనికో అర్ధం కావడం లేదు. మొన్నటిదాకా ఆమె వెనుక జగన్ ఉన్నాడని అనుకోగా సడెన్ గా టిడిపికి సపోర్ట్ గా మాట్లాడుతుంది.

అయితే శ్రీరెడ్డి మాటలను.. కామెంట్లను.. ట్వీట్లను సాధారణ ఆడియెన్స్ పట్టించుకోవడం మానేశారు. తానేదో ఆశించి చేస్తుంది అన్న టాక్ వచ్చింది. సినిమాల పరంగా ఏమి చేయలేక ఆమె ఇలా పక్కదారిలో వ్యక్తులను విమర్శిస్తుంది. మళ్లీ ఆమె వాయిస్ పెంచకముందే అడ్డుకట్ట వేస్తే బెటరని కొందరు అభిప్రాయపడుతున్నారు.

https://youtu.be/za1uEUUYNRM

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news