Moviesబాక్సాఫీస్ పై చరణ్ పంజా..

బాక్సాఫీస్ పై చరణ్ పంజా..

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా రంగస్థలం. ఈ సినిమా అంచనాలను అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. మార్చ్ 30న రిలీజ్ అయిన ఈ సినిమా వసూళ్ల సునామి సృష్టించింది. రిలీజ్ అయిన అన్నిచోట్ల లెక్కకు మించి లాభాలు తెచ్చి పెడుతుంది రంగస్థలం. 78.12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయిన ఈ సినిమా 25 రోజుల వరకు 110.32 కోట్ల షేర్ కలక్షన్స్ రాబట్టింది.

రాం చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా రంగస్థలం నిలిచిందని చెప్పొచ్చు. ధ్రువ తర్వాత రాం చరణ్ అసలు సిసలు స్టామినా ప్రూవ్ చేసిన సినిమా రంగస్థలం. చిట్టిబాబుగా రికార్డులతో చెడుగుడు ఆడిన రాం చరణ్ ప్రతి ఒక్క మెగా అభిమానిని కాలర్ ఎగురవేసేలా చేశాడు.

ఇక 25 రోజుల కలక్షన్స్ ఏరియాల వారిగా ఎలా ఉన్నాయో చూస్తే..

నైజాం 25.18 కోట్లు

సీడెడ్ 16.05 కోట్లు

ఉత్తరాంధ్ర 12.01 కోట్లు

గుంటూరు 7.86 కోట్లు

ఈస్ట్ 7.10 కోట్లు

వెస్ట్ 5.64 కోట్లు

కృష్ణా 6.52 కోట్లు

నెల్లూరు 3.11 కోట్లు

ఏపి/ తెలంగాణ టోటల్ కలక్షన్స్ 83.47 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా 10.80 కోట్లు

ఓవర్సీస్ 16.05 కోట్లు

వరల్డ్ వైడ్ 110.32 కోట్లు

వరల్డ్ వైడ్ గా 25 రోజుల్లో 110 కోట్లతో రాం చరణ్ బాక్సాఫీస్ పై తన పంజా విసిరాడని చెప్పొచ్చు. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news