Newsశవాల మీద డబ్బులు ఎరుకుంటున్నారు - యండమూరి సీరియస్

శవాల మీద డబ్బులు ఎరుకుంటున్నారు – యండమూరి సీరియస్

‘ప్రస్తుతం టీవీ ఛానెల్స్ లో ఇంకొకడి కష్టాలు చూసి ఆనందించడం చాలా శాడిజంగా మారిందని’ ప్రముఖ రచయిత, మానసిక వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. తాజాగా ఓ టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో పాల్గొన్న యండమూరి…. అసలు ఈ కలహాల కాపురాలను కలపడం కోసం టీవీల్లో నిర్వహించే షోల్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది ప్రశ్నార్ధకమేనని అన్నారు. తనకున్న అనుభవం మేరకు మానసికంగా ఆనందంగా ఉండే వాళ్లెవ్వరూ ఇలాంటి షోలు చూడరని అన్నారు.

టీవీ ఛానెల్స్ కు ఏమాత్రం ఇంగితజ్ఞానం ఉన్నా ఇలాంటి టీవీ షోలను బ్రాడ్ కాస్ట్ చేయద్దని సూచిస్తున్నానని, ప్రేక్షకులు కూడా ఇటువంటి ప్రోగ్రామ్ లను చూడకుండా ఉంటే ట్యామ్ రేటింగ్స్ తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. ఈ తరహా షోలలో పాల్గొనే వారికి కూడా తాము తప్పు చేస్తున్నామనే ఫీలింగ్ కూడా ఉండదని పాపులారిటీ కోసం చేస్తుంటారని అన్నారు. ఆయా టీవీ షోలలో తీర్పులిచ్చే వాళ్లు తనకు తెలుసని, వారిని చూస్తూనే ఉంటానని, వాళ్లకు వాళ్లు మేధావులుగా భావించుకుంటూ ఉంటారని విమర్శించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news