Moviesటాలీవుడ్‌లో కొత్త బంగారులోకం హీరోయిన్ ' శ్వేతాబ‌సు ' ను మోసం...

టాలీవుడ్‌లో కొత్త బంగారులోకం హీరోయిన్ ‘ శ్వేతాబ‌సు ‘ ను మోసం చేసి ముంచేసిందెవ‌రు…!

టాలీవుడ్‌లో దశాబ్దం క్రిందట వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన కొత్త బంగారులోకం సినిమాతో కుర్రకారును ఒక ఊపు ఊపేసింది హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. దిల్ రాజు బ్యానర్లో శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఎక్కడా ఎక్కడా అనే డైలాగ్ తో పిచ్చ పాపులర్ అయిపోయింది శ్వేతా బసు. తొలి సినిమా తర్వాత శ్వేత విచ్చలవిడిగా అందాలు ఆరబోసేసింది. చాలా చిన్న వయసులోనే తొలి సినిమాతోనే బంపర్ హిట్ కొట్టడం… ఇటు యూత్‌లో పిచ్చ క్రేజ్ రావడం… భారీ ఎక్స్‌పోజింగ్‌తో కుర్ర కారు గుండెల్లో నాటుకు పోయింది.

అయితే ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ మరీ ఓవర్ ఎక్స్‌పోజింగ్‌తో సీనియర్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకోలేదు. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో.. అటు తమిళంతో పాటు ఇటు బాలీవుడ్ సినిమాలు చేసింది. అయితే అక్కడ కూడా ఆమెకు హిట్ సినిమాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. విప‌రీత‌మైన జ‌ల్సాలు, ల‌గ్జ‌రీ లైఫ్‌న‌కు అల‌వాటు ప‌డిపోయిన శ్వేతాబ‌సు డ‌బ్బు కోసం అడ్డ‌దారులు తొక్కింద‌ని అంటారు.

అయితే ఆమెకు అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో పాటు ఆమెకు కొంద‌రు టాలీవుడ్ నిర్మాత‌లు డ‌బ్బులు ఎర‌వేసి.. ఆమె త‌ప్పుదారి ప‌ట్టేలా చేశార‌ని అంటారు. ఆ త‌ర్వాత ఆమె కొంద‌రు బ్రోక‌ర్ల చేతిలో చిక్కుకుంది. డ‌బ్బు కోసం వ్య‌భిచారం చేసేందుకు కూడా సిద్ధ‌మైంద‌న్న టాక్ వ‌చ్చేసింది. దీంతో శ్వేత ఒక‌టి రెండు సార్లు వ్య‌భిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోవ‌డంతో పాటు జైలుకు కూడా వెళ్లి వ‌చ్చింది. ఆ త‌ర్వాత తెలంగాణ‌కు చెందిన ఓ మాజీ మంత్రితో కూడా ఆమె రాస‌లీల‌లు కొన‌సాగించింద‌న్న చ‌ర్చ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇలా ఆమె చిన్న వ‌య‌స్సులోనే కెరీర్‌ను స్పాయిల్ చేసుకుంది. ఆమె బ‌ల‌హీన‌త‌ల‌ను చూసే కొంద‌రు నిర్మాత‌లు, అమ్మాయిల‌ను బ‌డా బాబుల‌కు పంపే బ్రోక‌ర్లు ఆమెను దెబ్బ‌కొట్టార‌ని అంటారు. ఆ తర్వాత తన ప్రేమికుడు రోహిత్ మిట్టల్‌ను 2018లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. విచిత్రమింటంటే పెళ్లయిన ఏడాదికే శ్వేత భర్త నుంచి విడాకులు తీసుకుంది. ప్ర‌స్తుతం మ‌ళ్లీ ఛాన్సుల కోసం ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో త‌న హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ వ‌స్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news