Newsటెన్ష‌న్ ప‌డుతుంటే మ‌హేష్ వ‌చ్చి చెవిలో ఏం చెప్పాడంటే... మీనాక్షి చౌద‌రి...

టెన్ష‌న్ ప‌డుతుంటే మ‌హేష్ వ‌చ్చి చెవిలో ఏం చెప్పాడంటే… మీనాక్షి చౌద‌రి సెన్షేష‌న‌ల్ కామెంట్స్‌

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – శ్రీలీల జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గుంటూరు కారం. మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుక‌గా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రానుంది. 2010లో వచ్చిన ఖలేజా తర్వాత 13 సంవత్సరాల గ్యాప్‌తో మరోసారి మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారం సినిమాపై టాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాలో మరో కుర్ర హీరోయిన్ మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆమెది సెకండ్ హాఫ్‌లో వచ్చే కీరోల్ అని తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ మీనాక్షి మహేష్ బాబు గురించి ఆసక్తికరమైన కామెంట్ చేయడంతో పాటు ఆయన రియల్ లైఫ్ లోను సూపర్ స్టార్ అని చెప్పారు. మ‌హేష్ చాలా ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తి.. ఆయ‌న సెట్లోనూ చాలా స్పెష‌ల్‌గా ఉంటార‌ని తెలిపింది.

తాను సెట్లోకి వ‌చ్చిన మొద‌టి రోజే మ‌హేష్‌తో షాట్ చేయాల్సి ఉండ‌డంతో కాస్త టెన్ష‌న్ ప‌డ్డాను… దీంతో మ‌హేష్ బాబు గారు నా దగ్గ‌ర‌కు వ‌చ్చి నో టెన్ష‌న్‌.. కాస్త స‌మ‌యం తీసుకోండి… ఏం కాదంటూ చాలా కూల్‌గా మాట్లాడారు. ఆయ‌న అలా అనేస‌రికి నాలో ధైర్యం వ‌చ్చింది.. ఆ త‌ర్వాత సీన్ల నుంచి చాలా కాన్పిడెంట్‌గా న‌టించాన‌ని మీనాక్షి తెలిపారు. ఇక షూటింగ్ ఆద్యంతం స‌ర‌దాగా ఉంద‌ని.. తాను ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న‌ట్టు తెలిపింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news