Moviesఅంత ఫిక్స్ అయ్యాక..బిగ్ బాస్ 7 కి మహేశ్ బాబు గెస్ట్...

అంత ఫిక్స్ అయ్యాక..బిగ్ బాస్ 7 కి మహేశ్ బాబు గెస్ట్ గా రాకుండా ఆపేసింది ఎవరో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ గా ప్రారంభమై గ్రాండ్ గా ఎండ్ అయిన విషయం కూడా తెలిసిందే . హౌస్ లో ఉన్న అన్ని నాళ్లు కంటెస్టెంట్స్ కొట్టుకొని చచ్చిపోయారు . ఆ తర్వాత ఎవరికి రావాల్సిన కప్పు వాళ్ళకి వచ్చింది. ఎవరికీ ముట్టాల్సిన డబ్బు వాళ్లకు ముట్టింది. ఇంతటితో ఆపేయకుండా పలువురు జనాలు కావాలని రైతుబిడ్డని హైలెట్ చేస్తూ మిగతా వాళ్లపై దాడి చేస్తున్నారు .

అయితే ఒక్కటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది ఆట . ఆటలో గెలుపు ఓటములు సహజం . ఈ విషయం పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి ఫైనల్ ఎపిసోడ్ గెస్ట్ గా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రావాలి అని బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఫిక్స్ చేసింది . మహేష్ బాబు కూడా ఓకే చేశారట . కానీ లాస్ట్ మూమెంట్లో మహేష్ బాబు కి ఓ అర్జెంటు పని పడి ఈ షెడ్యూల్ ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందట .

అంతేకాదు శ్రీ లీల మీనాక్షి చౌదరి ఈవెంట్ కి రావాల్సింది. కానీ మహేష్ బాబు రాకుండా వీళ్ళిద్దరూ వస్తే మహేష్ బాబు పై నెగిటివ్ ప్రచారం జరుగుతుందని సినీ మేకర్స్ వద్దన్నారట. అలా మహేష్ బాబు బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టేజిపై చూసే ఛాన్స్ జనాలు మిస్ చేసుకున్నారు. గుంటూరు కారం సంక్రాంత్రి కానుకగా రిలీజ్ కాబోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news