Newsఇద్ద‌రు టాప్ నిర్మాత‌ల మ‌ధ్య ' స‌లార్ ' రైట్స్‌ చిచ్చు......

ఇద్ద‌రు టాప్ నిర్మాత‌ల మ‌ధ్య ‘ స‌లార్ ‘ రైట్స్‌ చిచ్చు… పంతానికి పోయారుగా..!

పాన్ ఇండియా స్టార్, టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్గా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సినిమా సలార్. కే జి ఎఫ్ సీరిస్‌ సినిమాలతో నేషనల్ వైడ్‌గా తిరిగేలేని మాస్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న ప్రశాంత నీల్‌ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ త్రిల్లర్ కోసం ఇండియన్ సినిమా జనాలు అందరూ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ముందు షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. అనుకోని కారణాల వల్ల వాయిదా పడిన సలార్ సినిమాను డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

ఈ సినిమాకి నేషనల్ వైడ్‌గా కనివినీ ఎరిగిన రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది. ఇక మన తెలుగు స్టేట్స్ లో స‌లార్‌కు నెవర్ బిఫోర్ బిజినెస్ జరుగుతున్నట్టు సమాచారం. లేటెస్ట్‌గా నైజాం రైట్స్ కు సంబంధించి అదిరిపోయే బజ్‌ వినిపిస్తోంది. ముందుగా ఈ సినిమా రైట్స్ టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి.

రాజు ఏకంగా రు. 80 – 85 కోట్ల రేంజ్‌లో నైజాం స‌లార్ రైట్స్ కోసం ట్రై చేసిన‌ట్టుగా చెపుతూ వ‌చ్చారు. అయితే ఇప్పుడు ఈ రేసులోకి మైత్రీ మూవీస్ కూడా ఎంట‌రైన‌ట్టు టాక్ ? మైత్రీ వాళ్లు ఈ సంక్రాంతికే నైజాంలో డిస్ట్రిబ్యూష‌న్ ఆఫీస్ ఓపెన్ చేశారు. వీర‌సింహారెడ్డి, వాల్తేరు వీర‌య్య రెండు సినిమాలు మైత్రీ సొంత సినిమాలు కావ‌డంతో దిల్ రాజుకు పోటీగా వెళ్లి రిలీజ్ చేసి స‌క్సెస్ అయ్యారు. ఇక ఇటీవ‌ల వ‌చ్చిన ఖుషీతో స‌క్సెస్ కొట్టారు.

మైత్రీ వాళ్లు కూడా రాజు ఇస్తాన‌న్న రేటు కంటే ఎక్కువే ఇస్తామ‌ని భేర‌సారాలు మొద‌లు పెట్టిన‌ట్టు టాక్ ? ఇప్ప‌టికే నైజాం డిస్ట్రిబ్యూష‌న్‌లోకి మైత్రీ వాళ్లు ఎంట‌ర్ కావ‌డంతో రాజు వర్సెస్ మైత్రీ వాళ్ల మ‌ధ్య కోల్డ్‌వార్ మామూలుగా లేదు. ఇప్పుడు స‌లార్ రైట్స్ విష‌యంలో వీరి మ‌ధ్య గ‌ట్టి పంతాలు త‌ప్పేలా లేవు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news