సౌత్ ఇండియాలో ఉన్న అతి తక్కువ మంది బోల్డ్ బ్యూటీలలో శృతీహాసన్ ఒకరు. సీనియర్ హీరో విశ్వనటుడు కమలహాసన్ వారసరాలైన ఈమె తండ్రికి తగ్గ తనయగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు. నటిగా తన సినీ ప్రయాణాన్ని బాలీవుడ్ సినిమాలో లక్తో ప్రారంభించిన ఆమె ఎక్కువగా దక్షిణాదిలోనే పాపులర్ అయ్యారు. తాజాగా హాలీవుడ్ వెబ్ సిరీస్లలో నటిస్తున్న శృతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్ కు జోడిగా నటించిన పాన్ ఇండియా సినిమా సలార్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

కే జి ఎఫ్ దర్శకుడు ప్రశాంత నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శృతిహాసన్ ప్రస్తుతం తెలుగులో హాయ్ నాన్నా సినిమాలో నటిస్తున్నారు. నటి, గాయని, సంగీత దర్శకరాలు ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన శృతిహాసన్ కు ఇతర భాషల్లో అవకాశాలు వస్తున్నాయి. అయితే మాతృభాష అయిన తమిళ సినిమా పరిశ్రమ ఆమె టాలెంటును పెద్దగా వాడుకోవడం లేదని చెప్పాలి.

కారణాలు ఏమైనా విజయ్ సేతుపతికి జంటగా నటించిన లాభం సినిమా తర్వాత శృతిహాసన్ మళ్లీ కోలీవుడ్ లో కనిపించలేదు. ఇది ఇలా ఉంటే పాన్ ఇండియా సినిమా సలార్ తర్వాత కోలీవుడ్ లోనూ ఆమె బిజీ అవుతానని ఎన్నో ఆశలతో ఉన్నారు. ఎప్పుడు ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉండే శృతిహాసన్ తాజాగా ప్రత్యేకంగా ఫోటో స్టేషన్లు ఏర్పాటు చేసుకొని తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఈ ఫోటోలలో ఆమె చాలా అదిరిపోయే లుక్కులలో దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కనీసం ఈ ఫోటోలు వైరల్ అవ్వటం… అటు సలార్ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత అయినా కొన్నేళ్లపాటు తనకు మంచి ఛాన్సులు వస్తాయన్న ఆశలతో శృతిహాసన్ ఉంది. మరి ఆమె కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.