Movies"త్వరలోనే వాళ్లు గుంతలోకి పోతారు"..శృతి హాసన్ ఘాటు శాపనార్ధాలు ..!!

“త్వరలోనే వాళ్లు గుంతలోకి పోతారు”..శృతి హాసన్ ఘాటు శాపనార్ధాలు ..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ హద్దులు మీరిపోతున్నారు కేవలం అందాల ప్రదర్శనలతోనే కాదు మాటల విషయంలో కూడా హద్దులు మీరుతూ మాట్లాడేస్తున్నారు . మరి ముఖ్యంగా లోకనాయకుడిగా పాపులారిటీ సంపాదించుకున్న కమలహాసన్ ముద్దుల కూతురు శృతిహాసన్ అడ్డుఅదుపు లేకుండా మాట్లాడేస్తుంది . అసలు ఎందుకు మాట్లాడుతుందో..? ఎవరిని మాట్లాడుతుందో ..? ఏ కారణం చేత అలాంటి కామెంట్స్ చేస్తుందో ..? తెలియకుండా సోషల్ మీడియా వేదికగా అనవసరమైన కామెంట్స్ చేస్తుంది.

కాగా ఇప్పటికే తన బాయ్ ఫ్రెండ్ సంతాను హజారికా తో హద్దులు మీరిపోయే ఫోటోలు షేర్ చేస్తూ వచ్చిన శృతిహాసన్ రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది . ఈ పోస్ట్ ఆధారంగా ఆమె ఎవరినో బాగా తిడుతుంది అని అర్థం అయిపోతుంది . అయితే ఎవరిని తిడుతుందో అనేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. శృతిహాసన్ పోస్టుల్లో.. ‘నేను కొందరిని గమనిస్తున్నాను. వాళ్లు గోతులు తీస్తూ ఉన్నారు. కానీ చివరికి వాళ్లే అందులో పడిపోతుంటారు. అలాంటి వారి పట్ల నేను మౌనంగా ఉంటాను. నాపని నేను చేసుకుంటూ ఉంటాను. కర్మ వాళ్లకు తగిన శిక్షవిధిస్తుంది‘ అని రాసుకొచ్చింది.

దీంతో శృతిహాసన్ నోట ఇలాంటి మాట విన్న ఫ్యాన్స్ హర్ట్ అయిపోతున్నారు . అసలు నీకు ఎందుకు ఇంత కోపం ఎందుకు వచ్చింది..? శృతిహాసన్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్..? నిన్ను ఎవరు ఏమన్నారు..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి శృతి పోస్ట్ లోని మాటలు బట్టి ఆమె తీవ్రంగా హర్ట్ అయిందని తెలుస్తుంది . త్వరలోనే ఆమెను బాధపెట్టిన వాళ్లు శిక్ష కూడా అనుభవిస్తారు అంటూ శపించింది . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే పోస్ట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news