Movies"ఎవ్వరితోనైన లేచిపో..?" డైరెక్టర్ తేజ కూతురికి చెప్పిన మాటలు వింటే మైండ్...

“ఎవ్వరితోనైన లేచిపో..?” డైరెక్టర్ తేజ కూతురికి చెప్పిన మాటలు వింటే మైండ్ దొబ్బాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో ఎంతో మంచి స్థానాన్ని సంపాదించుకుని ఇండస్ట్రీకి ఎన్నో హిట్ సినిమాలను ఇచ్చాడు . అయితే ప్రెసెంట్ తేజ పొజిషన్ ఎంత దారుణంగా ఉందో తెలిసిందే. ఏ హీరో కూడా కాల్ షీట్స్ ఇవ్వట్లేదు . ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి . ఈ క్రమంలోనే తేజా ఇండస్ట్రీలో మల్ళీ పునర్ వైభవం అందుకోవాలంటే..ఒక భారీ హిట్ అవసరమంటున్నారు సినీ ప్రముఖులు .

కాగా దగ్గుబాటి వారసుడు అభిరామ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ “అహింస” అనే సినిమాను తెరకేకిస్తున్నాడు తేజ . ఈ క్రమంలోనే రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీ గురించి పలు హాట్ కామెంట్స్ చేశాడు . అంతేకాదు తన పర్సనల్ ప్రైవేట్ లైఫ్ గురించి కూడా బయట పెట్టాడు. ఈ క్రమంలోనే రిపోర్టర్ “మీ కొడుకు ఇండస్ట్రీలోకి రాబోతున్నాడు కదా ..? గత కొన్ని రోజులుగా ఇదే న్యూస్ ప్రచారం జరుగుతుంది . .? అంటూ ప్రశ్నించాడు.

ఈ క్రమంలోనే ఆయన మాత్లాడుతూ.. “నా కొడుకు డైరెక్షన్ కోర్స్ పూర్తి చేశాడు..త్వరలోనే ఇండస్ట్రీలోకి రాబోతున్నాడు..” అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు లూతురు విషయాని బయటపెడుతూ..”నా కూతురురీసెంట్ గా నే విదేశాలల్లో చదువు పూర్తి చేసింది. నేను ఒకే ఒక మాట చెప్పాను . నేను నీకు పెళ్లి చేయను.. నీకు నచ్చిన వాడిని నువ్వే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో.. ఆ తర్వాత భోజనాలు పెడదాం. పెళ్ళయ్యాక భర్త నచ్చలేదా విడాకులు ఇచ్చేసేయ్.. మనం సంతోషంగా బ్రతకడమే ముఖ్యం . జనాలు ఏమనుకుంటారో మనకు అనవసరం” అంటూ తన కూతురికి చెప్పినట్లు స్వయాన తేజ నే చెప్పుకొచ్చారు .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తేజ మాటలను ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. ఇంకా నయం నీ కూతురికి లేచిపో ..? అంటూ సలహా ఇవ్వలేదు . ఎవరైనా పిల్లలకి ఇలాంటి సజెషన్స్ ఇస్తారా.. అంటుంటే మరికొందరు తేజ చెప్పింది అక్షర సత్యం అని ..నేటి కాలంలో ఇలా ఉంటేనే పిల్లలు హ్యాపీగా ఉంటారని చెప్పుకొస్తున్నారు . దీంతో తేజా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news