Movies"మళ్ళీ పెళ్లి" సినిమా విడుదలకి బ్రేక్.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మూడో...

“మళ్ళీ పెళ్లి” సినిమా విడుదలకి బ్రేక్.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మూడో భార్య..!!

మరికొద్ది గంటల్లో టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోగా పేరు సంపాదించుకున్న వికే నరేష్ – పవిత్ర లోకేష్ నటించిన సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . మనకు తెలిసిందే గత కొన్ని నెలల నుంచి వీళ్ళు యవ్వారం సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో .. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో , అయితే వీళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న “మళ్లీ పెళ్లి” సినిమాతో ఆ క్రేజ్ ను పబ్లిసిటీని క్యాష్ చేసుకోవాలనుకున్నారు ఎంఎస్ రాజు .

ఎంఎస్ రాజు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా “మళ్ళీ పెళ్లి”. ఈ సినిమా మరి కొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కరెక్ట్ గా రిలీజ్ కి కొద్ది గంటల ముందు నరేష్ మాజీ మూడో భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది. కూకట్పల్లిలోని కోర్టులో ఆమె ఈ సినిమాని ఆపేయాలి అంటూ స్పెషల్ పిటిషన్ వేసిందట . దానికి కారణం ఈ సినిమాలో ఆమె పాత్రను కావాలనే చాలా బోల్డ్ గా ..వ్యంగ్యంగా చూపించారని ..అది ఆమె మనోభావాలను దెబ్బతీసిందని చెప్పుకొచ్చింది .

ఈ క్రమంలోనే “మళ్లీ పెళ్లి ” సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుందా ..? లేక ఆగిపోతుందా..? అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఈ సినిమా మొత్తం నరేష్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి ఇన్ని రోజులవుతున్న.. సినిమా ప్రమోషన్స్లో వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా.. సైలెంట్ గా ఉన్న రమ్య రఘుపతి.. కరెక్ట్ గా రిలీజ్ కి కొద్దిగా ముందే ఇలాంటి పిటిషన్ వేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా మాజీ నరేష్ మూడో మాజీ భార్యా నరేష్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది అంటూ ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news